దొంగిలించిన బంగారం కొనుగోలు చేసిన వ్యక్తి అరెస్ట్

- February 21, 2017 , by Maagulf
దొంగిలించిన  బంగారం కొనుగోలు చేసిన వ్యక్తి అరెస్ట్

దుబాయ్: దొంగ బంగారమని తెల్సినప్పటకీ.. ఆ మొత్తానికి  ఆశ పడి  కొనుగోలు చేసిన ఒక వ్యక్తిని షార్జాలో పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు.షార్జా పోలీసులు జారీ చేసిన ఓ  ప్రకటనలో, పాకిస్తాన్ దేశానికి చెందిన ఓ అనుమానితుడు 1 మిలియన్ డి హెచ్ విలువ కల్గిన దోచుకున్నబంగారం కడ్డీలను తన వాహనం లో దాచిపెట్టాడు. నల్గురు ఇతర స్వదేశాయులతో కల్సి వాటిని విక్రయించేందుకు సంప్రదించింది.400,000 డి హెచ్ విలువ చెల్లించి బంగారంకడఁడెలు కొనుగోలు చేసి కారులో దాచెనని ఆ తరువాత అతను 400,000 నగదు కారు నుండి అపహరించబడిందని అనుమానితుడు తెలిపారు.షార్జా పోలీస్  క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ శాఖ డైరెక్టర్ కల్నల్ ఇబ్రహీం అల్ అజిల్ మాట్లాడుతూ, "అనుమానితుడు తన ఫిర్యాదును దాఖలు చేసినప్పుడు, పోలీసు అధికారులు ఆ వ్యక్తి  దోపిడీ గురించి నిజాయితీగా ఉండటం లేదని అనుమానించారని  కానీ, నిందితుడు తన కథలోడబ్బు తన కారుని నుండి దొంగిలించబడిందని  పేర్కొన్నారని అన్నారు. తమ విచారణ సమయంలో, నిందితుడు  పోలీసుల ఎదుట తాను బంగారు కడ్డీలను  నలుగురు పాకిస్తానీ వ్యక్తుల నుంచి కొనుగోలు చేసెనని అరెస్టు.బాధితుడు 1 మిలియన్ దొంగిలించబడినదని చెప్పడం ద్వారా అమ్మక సమయంలో లాభం పొందాలని ప్రణాళిక రచించినట్లు పోలీసులు పరిశోధించారు. దోపిడీ , నకిలీ ఫిర్యాదు చేసిన వ్యక్తితో సహా దొంగతనం ఆరోపణలపై మరియు దొంగిలించబడిన వస్తువుల కొనుగోలు చేసిన నేరం , అలాగే పోలీసులకు తప్పుడు సాక్ష్యాలను అందించడం వంటి నేరాలపై  షార్జా పోలీస్  ఐదుగురు అనుమానితులను పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఎదుట ప్రవేశపెట్టారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com