దుబాయిలో తెలంగాణ వాసి మృతి
- February 21, 2017
దుబాయిలో జగిత్యాల జిల్లా జగిత్యాల మండలం తక్కళ్లపల్లి వాసి మల్లేపల్లి ఆనంద్ (26) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.దుబాయిలోని అల్ షఫర్ జనరల్ కాంట్రాక్టింగ్ కంపెనీలో ఎలక్ట్రీషియన్ అయిన ఆనంద్ విధినిర్వహణలో భాగంగా రోడ్డువెంట ఎలక్ట్రికల్ కేబుళ్లు వేస్తుండగా ఒక ట్రక్కు ఢీకొట్టడం వలన మరణించాడు.
మృతదేహాన్ని త్వరగా ఇండియాకు తెప్పించాలని కోరుతూ జగిత్యాల మండల పరిషత్ మాజీ అధ్యక్షులు రమేష్ బాబుతో పాటు మృతుని కుటుంబ సభ్యులు జగిత్యాల ఎమ్మెల్యే టి.జీవన్ రెడ్డిని కలిశారు. వెంటనే స్పందించిన జీవన్ రెడ్డి దుబాయిలోని ఇండియన్ ఎంబసీకి, ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు 'మదద్' ఆన్ లైన్ పోర్టల్ ద్వారా ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.
--భీం రెడ్డి.యం
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









