పాల తాళికలు
- February 22, 2017
కావలసిన పదార్థాలు : బియ్యం పిండి-పెద్ద గ్లాసు, పాలు-ఒక లీటరు, నీళ్ళు-ఒక లీటరు, సగ్గుబియ్యం-అర కప్పు, మైదాపిండి-అర కప్పు, బెల్లం-అర కిలో, పంచదార-ఒక కప్పు, జీడిపప్పు, కిస్మిస్-50గ్రా, యాలకుల పొడి-ఒక టీస్పూన్, ఉప్పు-తగినంత.
తయారుచేసే విధానం : మందపాటి గిన్నె స్టవ్పై ఉంచి అందులో పాలు, నీళ్లు పోసి మరగనివ్వాలి. మరో గిన్నెలో బియ్యంపిండి, మైదాపిండి, ఒక స్పూను బెల్లం, కొంచెం ఉప్పు వేసి మరిగే పాలు కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. తర్వాత మరుగుతున్న పాలలో సగ్గుబియ్యం వేసి, చక్రాల గిద్దలతోగాని, పాలతాళికల మూకుడుతోగాని పిండిని వత్తాలి. ఆఖర్లో చక్రాల గిద్దల్లోగాని, మూకుడులోగాని మిగిలిన పిండిలో కాసినినీళ్లు పోసి బాగా కలిపి ఆ నీళ్లను కూడా దాంట్లోనే పోయాలి. బెల్లాన్ని మెత్తగా దంచి అందులో కప్పు పంచదార కలిపి, కప్పు నీల్లు పోసి తీగపాకం పట్టుకుని ఈ పాకాన్ని ఉడుకుతున్న పాల తాళికల గిన్నెలో పోసి యాలకుల పొడి వేయాలి. తినేటప్పుడు నేతిలో దోరగా వేయించిన జీడిపప్పు, కిస్మిస్ పైన చల్లుకోవాలి.
తాజా వార్తలు
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!









