యండమూరి సంచలన కామెంట్స్‌ చిరంజీవి ప్రోగ్రామ్‌పై

- February 23, 2017 , by Maagulf
యండమూరి సంచలన కామెంట్స్‌ చిరంజీవి ప్రోగ్రామ్‌పై

ఒకప్పుడు చిరంజీవికి అత్యంత సన్నిహితంగా మెలిగిన రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో సూపర్‌హిట్‌ సినిమాలు వచ్చాయి. మరి, ఆ తర్వాత ఏమైందో వారిద్దరి మధ్య దూరం పెరిగింది. ఇటీవల ఓ ప్రోగ్రామ్‌లో రామ్‌చరణ్‌ను ధూషిస్తూ యండమూరి చేసిన కామెంట్స్‌.. వారి మధ్య దూరాన్ని మరింత పెంచాయి. ఆ కామెంట్స్‌కు మెగా బ్రదర్‌ నాగబాబు ఘాటుగా సమాధానం చెప్పడం, దానిపై మళ్లీ యండమూరి స్పందించడం జరిగిపోయాయి. అయితే మరోసారి ఇండైరెక్ట్‌గా చిరంజీవిపై విమర్శలు బాణాలు ఎక్కుపెట్టారు యండమూరి వీరేంద్రనాథ్‌. చిరు నిర్వహిస్తున్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ప్రోగ్రామ్‌పై యండమూరి సంచలన కామెంట్స్‌ చేశారు. ఆ ప్రోగ్రామ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
''మీలో ఎవరు కోటీశ్వరుడు' ప్రోగ్రామ్‌ పేరుతో ఘోరమైన మోసం జరుగుతోంది. ఆ షోలో పాల్గొనాలంటే ముందుగా మూడు మెసేజ్‌లు పంపాలి. ఒక్కో మెసేజ్‌కు ఐదు రూపాయలు ఖర్చవుతుంది. అంటే మూడు మెసేజ్‌లకు 15 రూపాయలు.

పది లక్షల మంది మేసేజ్‌లు పంపితే దాదాపు కోటిన్నర రూపాయలు నిర్వాహకుల జేబులో పడతాయి. తర్వాత ఐదు, ఆరు లక్షలు కుక్కలకు విసిరినట్లు విసురుతారు. వాటినే చొంగ కార్చుకుంటూ తీసుకుంటున్నాం. ఇంతకంటే హీనం మరొకటి ఉండదు.

చాలా పేదవాళ్లు కూడా ఇలాంటి వాటికి మెసేజ్‌లు పంపించి మోసపోతున్నారు. దీని కంటే లాటరీ టికెట్‌ కొనడం మేలు. లాటరీలను బ్యాన్‌ చేసిన ప్రభుత్వం ఇలాంటి గ్యాంబ్లింగ్‌ ప్రోగ్రామ్‌లను కూడా బ్యాన్‌ చేయాల'ని యండమూరి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com