యండమూరి సంచలన కామెంట్స్ చిరంజీవి ప్రోగ్రామ్పై
- February 23, 2017
ఒకప్పుడు చిరంజీవికి అత్యంత సన్నిహితంగా మెలిగిన రచయిత యండమూరి వీరేంద్రనాథ్. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో సూపర్హిట్ సినిమాలు వచ్చాయి. మరి, ఆ తర్వాత ఏమైందో వారిద్దరి మధ్య దూరం పెరిగింది. ఇటీవల ఓ ప్రోగ్రామ్లో రామ్చరణ్ను ధూషిస్తూ యండమూరి చేసిన కామెంట్స్.. వారి మధ్య దూరాన్ని మరింత పెంచాయి. ఆ కామెంట్స్కు మెగా బ్రదర్ నాగబాబు ఘాటుగా సమాధానం చెప్పడం, దానిపై మళ్లీ యండమూరి స్పందించడం జరిగిపోయాయి. అయితే మరోసారి ఇండైరెక్ట్గా చిరంజీవిపై విమర్శలు బాణాలు ఎక్కుపెట్టారు యండమూరి వీరేంద్రనాథ్. చిరు నిర్వహిస్తున్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ప్రోగ్రామ్పై యండమూరి సంచలన కామెంట్స్ చేశారు. ఆ ప్రోగ్రామ్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
''మీలో ఎవరు కోటీశ్వరుడు' ప్రోగ్రామ్ పేరుతో ఘోరమైన మోసం జరుగుతోంది. ఆ షోలో పాల్గొనాలంటే ముందుగా మూడు మెసేజ్లు పంపాలి. ఒక్కో మెసేజ్కు ఐదు రూపాయలు ఖర్చవుతుంది. అంటే మూడు మెసేజ్లకు 15 రూపాయలు.
పది లక్షల మంది మేసేజ్లు పంపితే దాదాపు కోటిన్నర రూపాయలు నిర్వాహకుల జేబులో పడతాయి. తర్వాత ఐదు, ఆరు లక్షలు కుక్కలకు విసిరినట్లు విసురుతారు. వాటినే చొంగ కార్చుకుంటూ తీసుకుంటున్నాం. ఇంతకంటే హీనం మరొకటి ఉండదు.
చాలా పేదవాళ్లు కూడా ఇలాంటి వాటికి మెసేజ్లు పంపించి మోసపోతున్నారు. దీని కంటే లాటరీ టికెట్ కొనడం మేలు. లాటరీలను బ్యాన్ చేసిన ప్రభుత్వం ఇలాంటి గ్యాంబ్లింగ్ ప్రోగ్రామ్లను కూడా బ్యాన్ చేయాల'ని యండమూరి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







