నందమూరి బాలకృష్ణ – పూరి జగన్నాథ్ క్రేజీ కాంబినేషన్
- February 24, 2017
నందమూరి బాలకృష్ణ – పూరి జగన్నాథ్ క్రేజీ కాంబినేషన్లో
భవ్య క్రియేషన్స్ సినిమా
మార్చి9న షూటింగ్ స్టార్ట్ – సెప్టెంబర్ 29న సినిమా విడుదల
శతచిత్ర కథానాయకుడు, నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించబోయే 101వ సినిమా ఖరారయింది. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించి, అగ్ర సంస్థల్లో ఒకటిగా దూసుకెళుతోన్న భవ్య క్రియేషన్స్ అధినేత వి. ఆనంద్ప్రసాద్ ఈ సినిమాను నిర్మించనున్నారు. పవర్ఫుల్ డైలాగులంటే తెలుగు ప్రేక్షకులకు ముందు గుర్తొచ్చే స్టార్ హీరో బాలకృష్ణ. ఇక, హీరోయిజమ్ను ప్రతి సీన్ సీన్కీ పైపైకి తీసుకువెళుతూ, పంచ్ డైలాగులతో థియేటర్లోని ప్రేక్షకులకు మాంచి ఫుల్ మీల్స్ అందించే దర్శకుడు పూరి జగన్నాథ్. ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా అనగానే యమా క్రేజ్ నెలకొంది. మహాశివరాత్రి సందర్భంగా నేడు ఈ సినిమా వివరాలను ప్రకటించారు. ‘‘రాకింగ్ అనౌన్స్మెంట్. బాలకృష్ణగారు హీరోగా భవ్య క్రియేషన్స్ ఆనంద్ప్రసాద్గారి నిర్మాణంలో నేను సినిమా చేస్తున్నాను’’ అని దర్శకుడు పూరి జగన్నాథ్ ట్వీట్ చేశారు.
నిర్మాత వి. ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ – ‘‘బాలకృష్ణ–పూరి జగన్నాథ్ కాంబినేషన్లో మొదటి సినిమా మా సంస్థలో నిర్మించే అవకాశం దక్కడం సంతోషంగా ఉంది. పవర్ఫుల్ మాస్ అండ్ యాక్షన్ అండ్ ఎంటర్టైనింగ్ మూవీ ఇది. బాలకృష్ణగారి పవర్ఫుల్ యాక్షన్కీ, పూరి జగన్నాథ్గారిలో పెన్ పవర్కీ, ఆయనలో దర్శకుడికీ తగ్గ అద్భుతమైన కథ కుదిరింది. ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తాం. చాలా కొత్తగా ఉండబోతుందీ సినిమా. మార్చి 9న షూటింగ్ ప్రారంభిస్తాం. ఈ ఏడాది సెప్టెంబర్ 29న సినిమాను విడుదల చేయాలని నిర్ణయించాం. త్వరలో కథానాయికలు, ఇతర తారాగణం, సాంకేతిక నిపుణులు, మిగతా వివరాలను ప్రకటిస్తాం’’ అన్నారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







