పాకిస్తాన్లో విమాన విషాదం
- February 24, 2017
పాకిస్తాన్కి చెందిన ఓ ప్రయివేట్ ట్రైనర్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో మార్గమధ్యంలోనే కుప్పకూలింది. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో జరిగిన ఈ దుర్ఘటనలో విమానం నేర్పిస్తున్న ఇన్స్ట్రక్టర్ సహా ట్రైనీ పైలట్ ప్రాణాలు కోల్పోయారు. షాహీన్ ఎయిర్ ఫ్లైయింగ్ ట్రైనింగ్ స్కూల్ (ఎస్ఏఎఫ్టీఎస్)కి చెందిన ఈ రెండు సీట్ల తేలికపాటి విమానం... ప్రమాదం కారణంగా పూర్తిగా ధ్వంసమైంది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:40 గంటలకు బయల్దేరిన ఈ విమానం 15 నిమిషాలకే సాంకేతిక లోపం కారణంగా పంజాబ్లోని ఫైసలాబాద్కు చేరుకోగానే కూలిపోయింది. దీనిపై విచారణకు ఆదేశించినట్టు పాకిస్తాన్ పౌర విమానయాన శాఖ ప్రకటించింది.
గతేడాది డిసెంబర్లో పాకిస్తాన్కి చెందిన ఓ విమానం కుప్పకూలడంతో 47 మంది చనిపోయారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









