పాకిస్తాన్లో విమాన విషాదం
- February 24, 2017
పాకిస్తాన్కి చెందిన ఓ ప్రయివేట్ ట్రైనర్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో మార్గమధ్యంలోనే కుప్పకూలింది. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో జరిగిన ఈ దుర్ఘటనలో విమానం నేర్పిస్తున్న ఇన్స్ట్రక్టర్ సహా ట్రైనీ పైలట్ ప్రాణాలు కోల్పోయారు. షాహీన్ ఎయిర్ ఫ్లైయింగ్ ట్రైనింగ్ స్కూల్ (ఎస్ఏఎఫ్టీఎస్)కి చెందిన ఈ రెండు సీట్ల తేలికపాటి విమానం... ప్రమాదం కారణంగా పూర్తిగా ధ్వంసమైంది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:40 గంటలకు బయల్దేరిన ఈ విమానం 15 నిమిషాలకే సాంకేతిక లోపం కారణంగా పంజాబ్లోని ఫైసలాబాద్కు చేరుకోగానే కూలిపోయింది. దీనిపై విచారణకు ఆదేశించినట్టు పాకిస్తాన్ పౌర విమానయాన శాఖ ప్రకటించింది.
గతేడాది డిసెంబర్లో పాకిస్తాన్కి చెందిన ఓ విమానం కుప్పకూలడంతో 47 మంది చనిపోయారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







