అతివేగం తో డ్రైవ్ చేస్తూ పట్టుబడిన ప్రముఖ నిర్మాత కొడుకు
- February 24, 2017
మితిమీరిన వేగంతో వాహనం నడపుతూ ఇతర వాహనదారులను, పాదచారులను భయబ్రాంతులకు గురి చేసిన సినీ నిర్మాత పరుచూరి ప్రసాద్ తనయుడు కిరీటి(22)పై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలింనగర్ రోడ్ నంబర్-10లో నివసించే పరుచూరి కిరీటి బీటెక్ చదివాడు. హీరో బాలకృష్ణ నటించిన సింహ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించాడు.
కొద్ది రోజుల నుంచి తన ఫార్చునర్ కారు( ఏపీ 09 సీవీ 2929)లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ రోడ్లపై దూసుకెళ్తూ ఇతరులకు ఇబ్బందికరంగా కలిగిస్తున్నట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ విషయంపై నాలుగు రోజులుగా నిఘా పెట్టిన పోలీసులు, సీసీ ఫుటేజీల ఆధారంగా కిరీటీ ర్యాష్ డ్రైవింగ్ ను గుర్తించారు.
దీంతో శుక్రవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్ చౌరస్తాలో పోలీసులు నిఘా వేసి మితిమీరిన వేగంతో దూసుకొస్తున్న వాహనాన్ని ఆపి కిరీటిని అరెస్టు చేశారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







