'వరాలసాయి' మందిరంలో వైభవంగా శివకళ్యాణం

- February 25, 2017 , by Maagulf

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భారతదేశమంతటా ప్రత్యేక పూజలు మరియు ప్రవచనాలతో భక్తులు మహాశివుణ్ణి కొలుచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణ జిల్లాకు చెందిన గూడూరు మండలంలో దత్తక్షేత్రం 'వరాలసాయి' మందిరంలో షిర్డీసాయి ఉపాసకులు పూజ్య దంపతులైన శ్రీ రామ్ రతంజీ మరియు మాత గార్ల ఆధ్వర్యంలో కల్యాణమంటపము నూతనంగా మందిర ఆవరణలో వైభవంగా ప్రారంభించటం జరిగింది. ఈ సందర్భంగా గురూజీ దంపతులు మరియు పలువురు ప్రముఖులు లింగోద్భవ కాలంలో శివ కళ్యాణం జరిపించి కళ్యాణమంటప శోభను ఇముడింపజేశారు. పూజ్య గురువులు శ్రీ రామ్ రతంజీ మాట్లాడుతూ " మహాశివరాత్రి నాడు శివ కల్యాణంతో ఈ కల్యాణ మండపాన్ని ప్రారంభించటం ఎంతో ఆనందంగా ఉందని మరియు వరాల సాయి కృపాకటాక్షాలు అందరిపై ఉండునని" ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో గురు దంపతులతోపాటు రవికుమార్ చోడవరపు దంపతులు, కృష్ణ రంజన్ దంపతులు, గుడ్లవల్లేటి పవన్ కుమార్ దంపతులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com