లింగ ప్రాధాన్యంపైనే కీలక చర్చ
- February 27, 2017
⇒; ముగిసిన కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సదస్సు
⇒; సదస్సులో పాల్గొన్న ఎంపీ కవిత
కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ) నిర్వహించిన సదస్సు ముగిసింది. లండన్లోని విల్టన్ పార్కులో మూడు రోజులపాటు జరిగిన సదస్సుకు మొత్తం 16 దేశాలకు చెందిన 24 మంది మహిళా ఎంపీలు హాజరయ్యారు. సదస్సులో ప్రధానంగా లింగ ప్రాధాన్యం పై చర్చించినట్లు ఇందులో పాల్గొన్న నిజామాబాద్ ఎంపీ కవిత తెలిపారు. లింగవివక్ష రూపాలను వివరించడంతో పాటు రాజకీయాలు, న్యాయ రంగాల్లో నెలకొన్న వివక్షపైనా చర్చించామన్నారు.
సభ్యులు తమ విజయ గాథలను మిగతా దేశాల సభ్యులతో పంచుకున్నారని, సదస్సు స్ఫూర్తినిచ్చిం దని, మహిళలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించామని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
సదస్సుకు సీపీఏ సెక్రటరీ జనరల్ అక్బర్ ఖాన్, ప్రివిలేజెస్ పార్లమెంటరీ కమిటీ చైర్పర్సన్ ఎం.లేఖి నాయకత్వం వహించారన్నారు.
తాజా వార్తలు
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!









