మౌన ప్రదర్శన ప్రవాసాంధ్రుల
- February 27, 2017
హూస్టన్, గుంటూరు, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): 'విద్వేషపూరిత రాజకీయాలకు మద్దతివ్వం.. శాంతిని ప్రేమిస్తాం..ఒకరికొకరుగా ఉంటే నిలబడతాం.. విడిపోతే కూలిపోతాం' అన్న నినాదాలతో కాన్సస్ నగరం దద్దరిల్లింది. జాతివివక్షకు బలైన కూచిభొట్ల శ్రీనివా్సకు నివాళిగా.. అక్కడి భారతీయులు భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాలల వేసి నివాళులర్పించారు. కొవ్వొత్తులతో శ్రద్ధాంజలి ఘటించారు. తానా అధ్యక్షుడు జంపాల చౌదరి, కాబోయే అధ్యక్షుడు సతీష్ వేమన బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో పలు తెలుగు సంఘాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా జంపాల చౌదరి మాట్లాడుతూ ప్రవాసాంధ్రులు మనోధైర్యంతో ఉండాలని సమస్యలు తాత్కాలికమేనని అన్నారు.
కాగా.. ప్యూరిన్టన్ కాల్పుల్లో గాయపడి కోలుకుంటున్న అలోక్రెడ్డి కుటుంబ సభ్యులను తానా ప్రతినిధులు పరామర్శించి సంఘీభావం తెలిపారు. ఆ తర్వాత జరిగిన కార్యక్రమంలో శ్రీనివాస్, కాల్పుల్లో గాయపడిన అలోక్ మిత్రులు, కాన్సస్ లెఫ్ట్నెంట్ గవర్నర్, ఒలాతే మేయర్, పోలీస్ చీఫ్ తదితరులు మాట్లాడారు. అలోక్ మాట్లాడుతూ శ్రీనివా్సతో తనది తొమ్మిదేళ్ల స్నేహమని చెప్పారు.
ఈ తొమ్మిదేళ్లలో ఒక్కసారికూడా అతడి నోటి వెంట నిర్లక్ష్యపూరిత మాటలు తాను వినలేదన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







