ఇరాన్ జైల్లో మగ్గుతున్న వలసదారులు
- February 28, 2017
మనామా: 30 మంది భారతీయ వలస ఫిషర్మెన్ని గత ఏడాది ఇరాన్ నేవీ అరెస్ట్ చేయగా, అప్పటినుంచీ వారంతా క్రిష్ ఐలాండ్ జైలులో మగ్గుతున్నారు. 30 మంది ఫిషర్ మెన్లో 15 మంది బహ్రెయిన్ కోసం పనిచేస్తున్నారు. మిగతావారంతా దుబాయ్కి చెందిన పలు కంపెనీల తరఫున ఫిషింగ్ కోసం పనిచేస్తున్నారు. జార్జ్, వర్గీస్ వర్మా, శ్ర్రీజిత్, ఆంటోనీ జాకోబ్, రవి, సిరిను, కెన్నెడే, సాగర్, క్లౌడిన్, సలెత్ రాజా, విన్సెంట్, ఆంటోనీ, ప్రశాంత్, రాజేష్కుమార్ తదితరులు ఇండియాలోని తమిళనాడులోగల కన్యాకుమారి, తిరునల్వేలి, రామనాథురం జిల్లాలకు చెందినవారు. 2016 అక్టోబర్లో వీరంతా అరెస్టయ్యారు. మరో 15 మంది 2016, డిసెంబర్లో అరెస్టయ్యారు. తమ సముద్ర జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారనే అభియోగాలతో ఇరాన్ నేవీ వీరిని అదుపులోకి తీసుకుంది. కనీస సౌకర్యాలు కూడా లేకుండా అరెస్టయినవారంతా జైళ్ళలో మగ్గుతున్నారని ఇంటర్నేషనల్ ఫిషర్మెన్ డెవలప్మెంట్ ట్రస్ట్ ప్రెసిడెంట్ జస్టిన్ ఆంటోనీ చెప్పారు. వారందరినీ అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు, దీనికి సంబంధించి ఎంబసీతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారాయన.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







