ఇరాన్ జైల్లో మగ్గుతున్న వలసదారులు
- February 28, 2017
మనామా: 30 మంది భారతీయ వలస ఫిషర్మెన్ని గత ఏడాది ఇరాన్ నేవీ అరెస్ట్ చేయగా, అప్పటినుంచీ వారంతా క్రిష్ ఐలాండ్ జైలులో మగ్గుతున్నారు. 30 మంది ఫిషర్ మెన్లో 15 మంది బహ్రెయిన్ కోసం పనిచేస్తున్నారు. మిగతావారంతా దుబాయ్కి చెందిన పలు కంపెనీల తరఫున ఫిషింగ్ కోసం పనిచేస్తున్నారు. జార్జ్, వర్గీస్ వర్మా, శ్ర్రీజిత్, ఆంటోనీ జాకోబ్, రవి, సిరిను, కెన్నెడే, సాగర్, క్లౌడిన్, సలెత్ రాజా, విన్సెంట్, ఆంటోనీ, ప్రశాంత్, రాజేష్కుమార్ తదితరులు ఇండియాలోని తమిళనాడులోగల కన్యాకుమారి, తిరునల్వేలి, రామనాథురం జిల్లాలకు చెందినవారు. 2016 అక్టోబర్లో వీరంతా అరెస్టయ్యారు. మరో 15 మంది 2016, డిసెంబర్లో అరెస్టయ్యారు. తమ సముద్ర జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారనే అభియోగాలతో ఇరాన్ నేవీ వీరిని అదుపులోకి తీసుకుంది. కనీస సౌకర్యాలు కూడా లేకుండా అరెస్టయినవారంతా జైళ్ళలో మగ్గుతున్నారని ఇంటర్నేషనల్ ఫిషర్మెన్ డెవలప్మెంట్ ట్రస్ట్ ప్రెసిడెంట్ జస్టిన్ ఆంటోనీ చెప్పారు. వారందరినీ అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు, దీనికి సంబంధించి ఎంబసీతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారాయన.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









