ఇరాన్‌ జైల్లో మగ్గుతున్న వలసదారులు

- February 28, 2017 , by Maagulf
ఇరాన్‌ జైల్లో మగ్గుతున్న వలసదారులు

మనామా: 30 మంది భారతీయ వలస ఫిషర్‌మెన్‌ని గత ఏడాది ఇరాన్‌ నేవీ అరెస్ట్‌ చేయగా, అప్పటినుంచీ వారంతా క్రిష్‌ ఐలాండ్‌ జైలులో మగ్గుతున్నారు. 30 మంది ఫిషర్‌ మెన్‌లో 15 మంది బహ్రెయిన్‌ కోసం పనిచేస్తున్నారు. మిగతావారంతా దుబాయ్‌కి చెందిన పలు కంపెనీల తరఫున ఫిషింగ్‌ కోసం పనిచేస్తున్నారు. జార్జ్‌, వర్గీస్‌ వర్మా, శ్ర్రీజిత్‌, ఆంటోనీ జాకోబ్‌, రవి, సిరిను, కెన్నెడే, సాగర్‌, క్లౌడిన్‌, సలెత్‌ రాజా, విన్సెంట్‌, ఆంటోనీ, ప్రశాంత్‌, రాజేష్‌కుమార్‌ తదితరులు ఇండియాలోని తమిళనాడులోగల కన్యాకుమారి, తిరునల్వేలి, రామనాథురం జిల్లాలకు చెందినవారు. 2016 అక్టోబర్‌లో వీరంతా అరెస్టయ్యారు. మరో 15 మంది 2016, డిసెంబర్‌లో అరెస్టయ్యారు. తమ సముద్ర జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారనే అభియోగాలతో ఇరాన్‌ నేవీ వీరిని అదుపులోకి తీసుకుంది. కనీస సౌకర్యాలు కూడా లేకుండా అరెస్టయినవారంతా జైళ్ళలో మగ్గుతున్నారని ఇంటర్నేషనల్‌ ఫిషర్‌మెన్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌ ప్రెసిడెంట్‌ జస్టిన్‌ ఆంటోనీ చెప్పారు. వారందరినీ అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు, దీనికి సంబంధించి ఎంబసీతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారాయన.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com