నటుడు ధనుష్ మంగళవారం ఉదయం మదురై కోర్టుకు హాజరయ్యారు
- February 28, 2017
చెన్నై: తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ అల్లుడు, నటుడు ధనుష్ మంగళవారం ఉదయం మదురై కోర్టుకు హాజరయ్యారు. ధనుష్ తమ కుమారుడంటూ మదురై జిల్లా మేలూర్ గ్రామానికి చెందిన కదిరేశన్, మీనాక్షి దంపతులు గతంలో మదురై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమకు ధనుష్ నుంచి జీవన భృతి ఇప్పించాలని కోర్టును వారు కోరారు. అయితే మదురై దంపతుల క్లెయిమ్లో నిజం లేదంటూ ధనుష్ అదో కోర్టులో పిటిషన్ వేశారు. విచారణలో భాగంగా రెండు వర్గాలు తమ వాదనకు బలం చేకూర్చే ఆధారాలను ప్రవేశపెట్టాలని కోర్టు ఆదేశించింది. కదరిశన్ దంపతులు కోర్టుకు సమర్పించిన టీసీలో పుట్టుమచ్చలు ఉండటం, ధనుష్ లాయర్ సమర్పించిన సర్టిఫికెట్లలో పుట్టుమచ్చలు లేకపోవడం గ్రహించిన కోర్టు...పుట్టుమచ్చల వెరిఫికేషన్ కోసం ఈనెల 28లోగా కోర్టుకు హాజరుకావాలని ధనుష్ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ధనుష్ మదురై హైకోర్టుకు మంగళవారం హాజరయ్యారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







