నటుడు ధనుష్ మంగళవారం ఉదయం మదురై కోర్టుకు హాజరయ్యారు

- February 28, 2017 , by Maagulf
నటుడు ధనుష్ మంగళవారం ఉదయం మదురై కోర్టుకు హాజరయ్యారు

చెన్నై: తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ అల్లుడు, నటుడు ధనుష్ మంగళవారం ఉదయం మదురై కోర్టుకు హాజరయ్యారు. ధనుష్ తమ కుమారుడంటూ మదురై జిల్లా మేలూర్ గ్రామానికి చెందిన కదిరేశన్, మీనాక్షి దంపతులు గతంలో మదురై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమకు ధనుష్ నుంచి జీవన భృతి ఇప్పించాలని కోర్టును వారు కోరారు. అయితే మదురై దంపతుల క్లెయిమ్‌లో నిజం లేదంటూ ధనుష్ అదో కోర్టులో పిటిషన్ వేశారు. విచారణలో భాగంగా రెండు వర్గాలు తమ వాదనకు బలం చేకూర్చే ఆధారాలను ప్రవేశపెట్టాలని కోర్టు ఆదేశించింది. కదరిశన్ దంపతులు కోర్టుకు సమర్పించిన టీసీలో పుట్టుమచ్చలు ఉండటం, ధనుష్ లాయర్ సమర్పించిన సర్టిఫికెట్లలో పుట్టుమచ్చలు లేకపోవడం గ్రహించిన కోర్టు...పుట్టుమచ్చల వెరిఫికేషన్ కోసం ఈనెల 28లోగా కోర్టుకు హాజరుకావాలని ధనుష్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ధనుష్ మదురై హైకోర్టుకు మంగళవారం హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com