ముగిసిన బ్యాంకు ఉద్యోగుల సమ్మె
- February 28, 2017_1488302813.jpg)
యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం జరిగిన సమ్మెలో ఉద్యోగులంతా పాల్గొన్నారని కన్వీనర్ కె.ఆదినారాయణమూర్తి తెలిపారు. ప్రజా వ్యతిరేక బ్యాంకింగ్ సంస్కరణలను, ఉద్యోగి వ్యతిరేక కార్మిక సంస్కరణలను, బ్యాంకు ఉద్యోగాల ఔట్సోర్సింగ్ను వ్యతిరేకిస్తూ, ఉద్యోగ నియామకాలను చేపట్టాలని, రాని బాకీల వసూలుకు కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన చేపడుతున్నామన్నారు. జిల్లాలోని సుమారు 700 బ్యాంకు శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులంతా మంగళవారం జరిగిన బ్యాంకు ఉద్యోగుల జాతీయ సమ్మెలో పాల్గొన్నారని తెలిపారు. సమ్మె కారణంగా జిల్లాలోని బ్యాంకు శాఖలు మూతపడ్డాయి అని అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం ఖైరతాబాద్ సిండికేట్ బ్యాంకు రీజినల్ ఆఫీస్ మరియు స్టేట్ బ్యాంకు అఫ్ హైదరాబాద్ వద్ద ఉద్యోగులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.


తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









