మార్చి 28నే ఉగాది: శ్రీనివాస గార్గేయ
- February 28, 2017
విజయవాడ, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): తిరుమల, శ్రీశైలం దేవస్థానాల పంచాంగాలతో జనంలో గందరగోళం నెలకొందని, ఉగాది పండుగను మార్చి 28వ తేదీనే జరుపుకోవాలని పొన్నలూరు శ్రీనివాస గార్గేయ సిద్ధాంతి విజ్ఞప్తి చేశారు. విజయవాడలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ''2016 ఆగస్టు 12వ తేదీన విజయవాడలో జయేంద్ర సరస్వతి సమక్షంలో జరిగిన ఒక సమావేశంలో హేవిళంబి నామ సంవత్సర ఉగాదిని 2017 మార్చి 28న నిర్వహించాలని నిర్ణయించారు. అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధాంతి కూడా ఇందుకు అంగీకరించారు. కానీ, బయటికి వచ్చాక మార్చి 29వ తేదీన ఉగాది అని ప్రకటించి, పంచాంగాలలో ఆ మేరకే ముద్రించారు. పాడ్యమి తిథి సూర్యోదయం తరువాత కనీసం 144 నిముషాలు ఉండాలి.
కానీ, 29వ తేదీ కేవలం 58 నిముషాలే ఉంటుంది. అందుకే, 28వ తేదీనే ఉగాది జరుపుకోవాలి'' అని శ్రీనివాస గార్గేయ తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







