నోటీస్ లేకుండా తొలగించారు: ఇండియన్ నర్స్ల ఆందోళన
- March 02, 2017
వందలాదిమంది ఇండియన్ నర్స్లు, తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా విధుల నుంచి తొలగించారని ఆరోపిస్తూ కువైట్లోని ఇండియన్ ఎంబసీలో ఫిర్యాదు చేశారు. ఫర్వానియా హాస్పిటల్లో వీరంతా పనిచేస్తున్నారు. ఐదేళ్ళ క్రితం మూడేళ్ళ కాంట్రాక్ట్ నిమిత్తం వీరంతా ఓ కాంట్రాక్టింగ్ కంపెనీ ద్వారా నియమితులయ్యారు. రెండేళ్ళ క్రితం కంపెనీ, వీరి కాంట్రాక్ట్ని రెన్యువల్ చేసింది. అయితే కాంట్రాక్ట్ పీరియడ్ ముగిసిందని పేర్కొంటూ మూడు రోజుల్లో దేశం విడిచివెళ్ళాల్సిందిగా ఆదేశాలు చేయడంతో నర్సులు ఒక్కసారిగా ఆందోళన చెందారు. గతంలోలా మరోసారి తమకు రెన్యువల్ కోసం అవకాశం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అధికారిక కాంట్రాక్ట్ పీరియడ్ ముగిసినా, నర్సులు ఆ కంపెనీకి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదు. అయినప్పటికీ ఉన్నపళంగా ఉద్యోగాలు కోల్పోవడం వల్ల వాళ్ళంతా రోడ్డునపడ్డట్లయ్యింది. తమ పిల్లలు కువైట్లోని పలు స్కూళ్ళలో పరీక్షలు రాస్తున్నారనీ, ఈ సమయంలో మూడు రోజుల్లోనే కువైట్ విడిచి వెళ్ళాలనడం అన్యాయమని నర్స్లు ఆవేదన చెందుతున్నారు.
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









