నోటీస్ లేకుండా తొలగించారు: ఇండియన్ నర్స్ల ఆందోళన
- March 02, 2017
వందలాదిమంది ఇండియన్ నర్స్లు, తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా విధుల నుంచి తొలగించారని ఆరోపిస్తూ కువైట్లోని ఇండియన్ ఎంబసీలో ఫిర్యాదు చేశారు. ఫర్వానియా హాస్పిటల్లో వీరంతా పనిచేస్తున్నారు. ఐదేళ్ళ క్రితం మూడేళ్ళ కాంట్రాక్ట్ నిమిత్తం వీరంతా ఓ కాంట్రాక్టింగ్ కంపెనీ ద్వారా నియమితులయ్యారు. రెండేళ్ళ క్రితం కంపెనీ, వీరి కాంట్రాక్ట్ని రెన్యువల్ చేసింది. అయితే కాంట్రాక్ట్ పీరియడ్ ముగిసిందని పేర్కొంటూ మూడు రోజుల్లో దేశం విడిచివెళ్ళాల్సిందిగా ఆదేశాలు చేయడంతో నర్సులు ఒక్కసారిగా ఆందోళన చెందారు. గతంలోలా మరోసారి తమకు రెన్యువల్ కోసం అవకాశం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అధికారిక కాంట్రాక్ట్ పీరియడ్ ముగిసినా, నర్సులు ఆ కంపెనీకి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదు. అయినప్పటికీ ఉన్నపళంగా ఉద్యోగాలు కోల్పోవడం వల్ల వాళ్ళంతా రోడ్డునపడ్డట్లయ్యింది. తమ పిల్లలు కువైట్లోని పలు స్కూళ్ళలో పరీక్షలు రాస్తున్నారనీ, ఈ సమయంలో మూడు రోజుల్లోనే కువైట్ విడిచి వెళ్ళాలనడం అన్యాయమని నర్స్లు ఆవేదన చెందుతున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







