క్వీన్ ఎలిజబెత్ ను కలిసిన కమల్
- March 02, 2017
సిని పరిశ్రమలో ఓ ఆపుర్వ సంఘటన చోటు చేసుకుంది లోకనాయకుడు కమల్హాసన్ బ్రిటన్ రాణి ఎలిజబెత్-2ను కలిశారు. బకింగ్హామ్ ప్యాలెస్లో జరిగిన ఇండో-యూకే కల్చరల్ ఎక్స్ఛేంజి సెలబ్రేషన్స్ 2017 కార్యక్రమంలో కమల్హాసన్ పాల్గొన్నారు. ఈ సందర్భం క్వీన్ ఎలిజబెత్ ఆయన కలిశారు. అలాగే ఆమె భారత్ పర్యటనను గుర్తుంచుకున్నారు కమల్హాసన్. 1997లో క్వీన్ ఎలిజబెత్ భారత పర్యటనలో భాగంగా చెన్నైకి వెళ్లారు. అప్పుడు ఆమె మరుదనాయగం సినిమా సెట్కు రావడాన్ని కమల్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం కమల్ తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'శభాష్ నాయుడు' తో బిజీగా వున్నారు. ఈ చిత్రంలో కమల్ కు జోడిగా రమ్యకృష్ణ నటిస్తుండగా, ఆయన కూతురి పాత్రను శ్రుతి హసన్ పోషిస్తోంది. బ్రహ్మానందం ఇందులో మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు.చిత్రానికి మ్యాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అందిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









