ముందస్తు జీతాల చెల్లింపు లేనట్టే
- September 22, 2015
ఈద్ అల్ అదా కోసం ముందస్తుగా జీతాల చెల్లింపు అవసరం లేదని మానవ వనరుల మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. జీతాల చెల్లింపు తేదీ, ఈద్కి దగ్గరలో ఉంది గనుక, ప్రత్యేకంగా ముందస్తు జీతాల చెఇaల్లంపు కోసం ఎలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని, ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలకు ఇది వర్తిస్తుందని ఆయన అన్నారు. మరోవైపు ప్రభుత్వ రంగం వ్యవధి తక్కువ ఉండటంతో ముందస్తు జీతాల చెల్లింపుపై నిర్ణయం తీసుకోలేదనీ, సెలవుల వ్యవధి తక్కువ ఉండటమే దీనికి కారణమని చెప్పారు. అయితతే అధికారిక ప్రకటన ముందస్తు జీతాలను ఆశిస్తున్నవారిని నిరాశపరిచింది. మహమ్మద్ ఫైసల్ అనే వ్యక్తి, ఈద్ అల్ అదా కోసం కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలనుకున్నామనీ, ఈ నిర్ణయం తమను నిరాశపరిచిందనీ, తమ ప్రణాళికల్ని మానుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ప్రతి సంవత్సరం ముందే జీతాలు చెల్లించేలా మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకునేదనీ, ఈ సంవత్సరం కూడా అలాగే జరుగుతుందని ఆశించినట్లు ఆయన వివరించారు. ప్రైవేటు కంపెనీల ప్రతినిథి ఒకరు, అధికారిక ప్రకటనను స్వాగతించారు. చాలా కంపెనీలకు నిధులు నెలాఖరుకు సమకూరుతాయి గనుక, ముందస్తు చెల్లింపులు ఇబ్బందికరంగా మారతాయని ఆయన చెప్పారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!







