ఖతార్ వచ్చే కార్మికులకు ఎలక్ట్రానిక్ ఒప్పందాలు
- September 22, 2015
ఖతర్ వచ్చే కార్మికుల కోసం ఎలక్ట్రానిక్ ఒప్పందాన్ని వచ్చే ఏడాది ప్రారంభంలో అమలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఖతార్లో ఈ విధానం తొలిసారిగా అమలు చేయబడనుంది. మార్చ్ 2016 నాటికి అమలు చేయాలని యోచిస్తున్నట్లు కార్మిక, సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి మహమ్మద్ అలీ అల్ మీర్ చెప్పారు. కార్మికులు వారి హక్కుల గురించి తెలుసుకోవడానికి ఈ విధానం ఉపయోగపడనుంది. కొత్త వ్యవస్థ ద్వారా కార్మికులు ప్రభుత్వ వెబ్సైట్ని యాక్సెస్ చెయ్యగలగడం, వారి పేరు లేదా ఐడి లేదా వీసా నంబర్ వంటి వాటి ద్వారా వారి ఒప్పందాల వివరాల్ని వీక్షించగలరని ఆయన చెప్పారు. వారి సొంత భాషల్లో ఒప్పందాల వివరాల్ని తెలుసుకునే వీలుంటుంది. నేపాల్, ఉర్దూ సహా పది భాషలను ప్రయోగాత్మకంగా ప్రవేశపెడుడుతున్నారు. 1.7 మిలియన్ విదేశీ కార్మికులు ఖతార్లో నివసిస్తుండగా, వారు వివిధ ఒప్పందాల ద్వారా ఎదుర్కొంటున్న సమస్యలకు ఈ ఎలక్ట్రానిక్ విధానం ద్వారా పరిష్కారం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. 2020 నాటికి రెండు మిలియన్ల కన్నా ఎక్కువ మంది విదేశీ కార్మికులు ఖతర్లో నివసిస్తారనేది ఓ అంచనా. 2013, జూన్లో ఈ విలువ 42 బిలియన్ దిర్హామ్లుగా వుంది.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







