ఎమిరేటీల కోసం ఇండియాలో 5 ఏళ్ళ మల్టిపుల్‌ ఎంట్రీ వీసా

- March 03, 2017 , by Maagulf
ఎమిరేటీల కోసం ఇండియాలో 5 ఏళ్ళ మల్టిపుల్‌ ఎంట్రీ వీసా

యూఏఈ వ్యాపారవేత్తల కోసం ఐదేళ్ళ మల్టిపుల్‌ ఎంట్రీ వీసాని మంజూరు చేసేందుకోసం భారత ప్రభుత్వం ఆసక్తితో ఉంది. యూఏఈలోని ఇండియన్‌ అంబాసిడర్‌ నవ్‌దీప్‌ సూరి మాట్లాడుతూ, బోనఫైడ్‌ అయిన ఏ బిజినెస్‌ మెన్‌ అయినా ఈ వీసా అందుబాటులో ఉంటుందని అన్నారు. ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు మరింత పెంపొందించే క్రమంలో ఈ సరికొత్త వెసులుబాటు కలగనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్‌ 1 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రానుందని సూరి అభిప్రాయపడ్డారు. డేరా ట్రావెల్స్‌ అండ్‌ టూర్స్‌ జనరల్‌ మేనేజర్‌ టిపి సుధీష్‌ ఈ అంశంపై మాట్లాడుతూ, మల్టిపుల్‌ ఎంట్రీ వీసాతో బిజినెస్‌ అలాగే టూరిజం ట్రావెల్‌ ఇండియాకి బాగా పెరుగుతుందని, ఎక్కువమంది మెడికల్‌ రిలేటెడ్‌ విజిటర్స్‌ కూడా దీంతో లాభం పొందే అవకాశాలున్నాయని తెలిపారు. 
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com