ఎమిరేటీల కోసం ఇండియాలో 5 ఏళ్ళ మల్టిపుల్ ఎంట్రీ వీసా
- March 03, 2017
యూఏఈ వ్యాపారవేత్తల కోసం ఐదేళ్ళ మల్టిపుల్ ఎంట్రీ వీసాని మంజూరు చేసేందుకోసం భారత ప్రభుత్వం ఆసక్తితో ఉంది. యూఏఈలోని ఇండియన్ అంబాసిడర్ నవ్దీప్ సూరి మాట్లాడుతూ, బోనఫైడ్ అయిన ఏ బిజినెస్ మెన్ అయినా ఈ వీసా అందుబాటులో ఉంటుందని అన్నారు. ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు మరింత పెంపొందించే క్రమంలో ఈ సరికొత్త వెసులుబాటు కలగనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రానుందని సూరి అభిప్రాయపడ్డారు. డేరా ట్రావెల్స్ అండ్ టూర్స్ జనరల్ మేనేజర్ టిపి సుధీష్ ఈ అంశంపై మాట్లాడుతూ, మల్టిపుల్ ఎంట్రీ వీసాతో బిజినెస్ అలాగే టూరిజం ట్రావెల్ ఇండియాకి బాగా పెరుగుతుందని, ఎక్కువమంది మెడికల్ రిలేటెడ్ విజిటర్స్ కూడా దీంతో లాభం పొందే అవకాశాలున్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!
- ఎయిర్ పోర్టుల భద్రతకు సమగ్ర ప్రణాళిక అమలు..!!
- బహ్రెయిన్లో మొట్టమొదటి వర్చువల్ హార్స్ వేలం..!!
- వారంలో 1,077 స్మగ్లింగ్ కేసులు నమోదు: సౌదీ కస్టమ్స్
- సుల్తాన్ తో ఇరాన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- కువైట్ ఎయిర్వేస్ టికెట్లు ఆకస్మిక రద్దు – ప్రయాణికుల ఆందోళన
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్
- కేరళలో ఘనంగా మొదలైన పూరం సంబరాలు









