భారత జాలర్లను అరెస్టు చేసిన పాకిస్తాన్ నేవీ

- March 05, 2017 , by Maagulf
భారత జాలర్లను అరెస్టు చేసిన పాకిస్తాన్ నేవీ

పాకిస్తాన్ నేవీ అధికారులు అరేబియా సముద్రంలో భారత్‌కు చెందిన 88 మంది జాలర్లను అదుపులోకి తీసుకుని, గుజరాత్‌ తీరప్రాంతానికి చెందిన 15 పడవలను స్వాదీనం చేసుకుంది. అక్రమంగా తమ జలాల్లోకి ప్రవేశించారని ఆరోపిస్తూ జాలర్లను అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. గత మంగళవారంనాడు శ్రీలంక నేవీ అధికారులు 8 మందికి పైగా భారత జాలర్లను, ఒక పడవను ధనుష్కోడి సౌత్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఉత్తర డెల్ఫ్ట్ ఐలాండ్ జలాల్లోనూ మరో 13 మంది భారత జాలర్లును అరెస్టు చేసి, రెండు పడవలను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం కనకేశన్‌తురై పోలీసు స్టేషన్‌కు వారిని తరలించారు. గత ఫిబ్రవరి 7న కూడా శ్రీలంక నేవీ అధికారులు తమిళనాడులోని రామేశ్వరానికి చెందిన 10 మంది మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com