భారత జాలర్లను అరెస్టు చేసిన పాకిస్తాన్ నేవీ
- March 05, 2017
పాకిస్తాన్ నేవీ అధికారులు అరేబియా సముద్రంలో భారత్కు చెందిన 88 మంది జాలర్లను అదుపులోకి తీసుకుని, గుజరాత్ తీరప్రాంతానికి చెందిన 15 పడవలను స్వాదీనం చేసుకుంది. అక్రమంగా తమ జలాల్లోకి ప్రవేశించారని ఆరోపిస్తూ జాలర్లను అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. గత మంగళవారంనాడు శ్రీలంక నేవీ అధికారులు 8 మందికి పైగా భారత జాలర్లను, ఒక పడవను ధనుష్కోడి సౌత్లో అదుపులోకి తీసుకున్నారు. ఉత్తర డెల్ఫ్ట్ ఐలాండ్ జలాల్లోనూ మరో 13 మంది భారత జాలర్లును అరెస్టు చేసి, రెండు పడవలను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం కనకేశన్తురై పోలీసు స్టేషన్కు వారిని తరలించారు. గత ఫిబ్రవరి 7న కూడా శ్రీలంక నేవీ అధికారులు తమిళనాడులోని రామేశ్వరానికి చెందిన 10 మంది మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- అమెరికాతో చర్చలకు అధ్యక్షుడి ఆదేశాలు: ఇరాన్ మీడియా
- 10 తర్వాత పూర్తి స్థాయిలో ఇండిగో విమానాల కార్యాచరణ
- అగ్రిటెక్ 2026: ఫిబ్రవరి 12న ప్రారంభం..!!
- జజాన్ హానీ ఎగ్జిబిషన్.. 4 రోజుల్లో రికార్డు సేల్స్..!!
- వెబ్సైట్ డౌన్.. యూఏఈ లాటరీ క్లారిటీ..!!
- ఎక్స్ఛేంజ్ కంపెనీలలో క్యాష్ లిమిట్ తగ్గింపు..!!
- డిజెబిలిటీ కార్డుతో ప్రభుత్వ సేవలు, ప్రయోజనాలు..!!
- రమదాన్ కు సిద్ధమవుతున్న బహ్రెయిన్..!!
- నంబర్ ప్లేట్ కోసం రూ.2.08 కోట్లు..వ్యాపారవేత్త సంచలనం
- ఓల్డ్ దోహా పోర్టులో 6రోజులపాటు స్పోర్ట్స్ ఫెస్టివల్..!!







