భారత జాలర్లను అరెస్టు చేసిన పాకిస్తాన్ నేవీ
- March 05, 2017
పాకిస్తాన్ నేవీ అధికారులు అరేబియా సముద్రంలో భారత్కు చెందిన 88 మంది జాలర్లను అదుపులోకి తీసుకుని, గుజరాత్ తీరప్రాంతానికి చెందిన 15 పడవలను స్వాదీనం చేసుకుంది. అక్రమంగా తమ జలాల్లోకి ప్రవేశించారని ఆరోపిస్తూ జాలర్లను అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. గత మంగళవారంనాడు శ్రీలంక నేవీ అధికారులు 8 మందికి పైగా భారత జాలర్లను, ఒక పడవను ధనుష్కోడి సౌత్లో అదుపులోకి తీసుకున్నారు. ఉత్తర డెల్ఫ్ట్ ఐలాండ్ జలాల్లోనూ మరో 13 మంది భారత జాలర్లును అరెస్టు చేసి, రెండు పడవలను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం కనకేశన్తురై పోలీసు స్టేషన్కు వారిని తరలించారు. గత ఫిబ్రవరి 7న కూడా శ్రీలంక నేవీ అధికారులు తమిళనాడులోని రామేశ్వరానికి చెందిన 10 మంది మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







