'ఫ్లిప్కార్ట్' నుంచి శుభవార్త
- March 05, 2017
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ శుభవార్త చెప్పింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 30 శాతం అధికంగా ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ మేరకు సంస్థ సీవోవో నితిన్ సేథీ తెలిపారు. పోటీ సంస్థ స్నాప్డీల్ ఉద్యోగులకు పింక్ స్లిప్లు ఇస్తుంటే ఫ్లిప్కార్ట్ మాత్రం ఉద్యోగుల సంఖ్యను పెంచేందుకు ప్రణాళికలు రచిస్తుండడం గమనార్హం. మార్కెట్లో తనకు ప్రధాన పోటీగా ఉన్న అమెజాన్ను మరింత దీటుగా ఎదుర్కొనే ఉద్దేశంలో భాగంగానే ఉద్యోగులను పెంచుతున్నట్టు సమాచారం. ఉద్యోగుల సంఖ్యను పెంచి వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా సంస్థను విస్తరిస్తామని నితిన్ వివరించారు. గతేడాది ఫ్లిప్కార్ట్ 1500 మంది ఉద్యోగులను తీసుకుంది.
ప్రస్తుతం ఈ సంస్థలో పదివేల మంది తాత్కాలిక ఉద్యోగులు ఉన్నారు. ఇప్పుడు మరో 30 శాతం మందిని తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
తాజా వార్తలు
- అమెరికాతో చర్చలకు అధ్యక్షుడి ఆదేశాలు: ఇరాన్ మీడియా
- 10 తర్వాత పూర్తి స్థాయిలో ఇండిగో విమానాల కార్యాచరణ
- అగ్రిటెక్ 2026: ఫిబ్రవరి 12న ప్రారంభం..!!
- జజాన్ హానీ ఎగ్జిబిషన్.. 4 రోజుల్లో రికార్డు సేల్స్..!!
- వెబ్సైట్ డౌన్.. యూఏఈ లాటరీ క్లారిటీ..!!
- ఎక్స్ఛేంజ్ కంపెనీలలో క్యాష్ లిమిట్ తగ్గింపు..!!
- డిజెబిలిటీ కార్డుతో ప్రభుత్వ సేవలు, ప్రయోజనాలు..!!
- రమదాన్ కు సిద్ధమవుతున్న బహ్రెయిన్..!!
- నంబర్ ప్లేట్ కోసం రూ.2.08 కోట్లు..వ్యాపారవేత్త సంచలనం
- ఓల్డ్ దోహా పోర్టులో 6రోజులపాటు స్పోర్ట్స్ ఫెస్టివల్..!!







