'ఫ్లిప్కార్ట్' నుంచి శుభవార్త
- March 05, 2017
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ శుభవార్త చెప్పింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 30 శాతం అధికంగా ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ మేరకు సంస్థ సీవోవో నితిన్ సేథీ తెలిపారు. పోటీ సంస్థ స్నాప్డీల్ ఉద్యోగులకు పింక్ స్లిప్లు ఇస్తుంటే ఫ్లిప్కార్ట్ మాత్రం ఉద్యోగుల సంఖ్యను పెంచేందుకు ప్రణాళికలు రచిస్తుండడం గమనార్హం. మార్కెట్లో తనకు ప్రధాన పోటీగా ఉన్న అమెజాన్ను మరింత దీటుగా ఎదుర్కొనే ఉద్దేశంలో భాగంగానే ఉద్యోగులను పెంచుతున్నట్టు సమాచారం. ఉద్యోగుల సంఖ్యను పెంచి వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా సంస్థను విస్తరిస్తామని నితిన్ వివరించారు. గతేడాది ఫ్లిప్కార్ట్ 1500 మంది ఉద్యోగులను తీసుకుంది.
ప్రస్తుతం ఈ సంస్థలో పదివేల మంది తాత్కాలిక ఉద్యోగులు ఉన్నారు. ఇప్పుడు మరో 30 శాతం మందిని తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







