66 వేల మంది వలసపోయారు : ఐరాస
- March 05, 2017
సరిహద్దు విషయంలో సిరియాలో చెలరేగిన అంతర్యుద్ధం వల్ల 66 వేల మంది తమ ప్రాంతాలను వదిలి వెళ్లినట్టు ఐక్యరాజ్యసమితి మానవత్వ సమన్వయ ఏజెన్సీ(ఓసీహెచ్ఏ) అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలకు మధ్య జరుగుతున్న పోరులో ఆల్ బాబ్, తడుఫ్ నగరాల నుంచి 40వేలమంది, ఆల్ బాబ్ తూర్పు ప్రాంత నుంచి 26వేల మంది స్థానికులు వెళ్లిపోయారని ఓసీహెచ్ఏ ఉత్తర అలెప్పో ఫ్రావిన్స్ పేర్కొంది. కొన్ని నెలల పోరాటం తర్వాత ఫిబ్రవరి 23న ఐఎస్ కబంధ హస్తాల నుంచి ఆల్ బాబ్ను టర్కీ తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్నారు. జిహాదీ గ్రూపులు సృష్టించిన పేలుళ్ల ద్వారా అధిక మొత్తంలో వచ్చిన కాలుష్యం వల్ల 40వేల మంది నగరం నుంచి వెళ్లిపోయినట్టు ఓసీహెచ్ఏ నివేదిక చెబుతోంది.
ఐఎస్ అంతం చేయాలని సంకల్పించిన నేపథ్యంలో చెలరేగిన విధ్వంసం వల్ల తూర్పు ఆల్బాబ్ నగరం 26వేలమంది వెళ్లిపోయారు. యూఎస్ సాయంతో సిరియన్ బలగాల ఆధీనంలో ఉన్న మాంబ్జీ పరిసర ప్రాంతాలకు శరణార్థులుగా వలస వెళ్లారని ఓసీహెచ్ఏ అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







