66 వేల మంది వలసపోయారు : ఐరాస
- March 05, 2017
సరిహద్దు విషయంలో సిరియాలో చెలరేగిన అంతర్యుద్ధం వల్ల 66 వేల మంది తమ ప్రాంతాలను వదిలి వెళ్లినట్టు ఐక్యరాజ్యసమితి మానవత్వ సమన్వయ ఏజెన్సీ(ఓసీహెచ్ఏ) అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలకు మధ్య జరుగుతున్న పోరులో ఆల్ బాబ్, తడుఫ్ నగరాల నుంచి 40వేలమంది, ఆల్ బాబ్ తూర్పు ప్రాంత నుంచి 26వేల మంది స్థానికులు వెళ్లిపోయారని ఓసీహెచ్ఏ ఉత్తర అలెప్పో ఫ్రావిన్స్ పేర్కొంది. కొన్ని నెలల పోరాటం తర్వాత ఫిబ్రవరి 23న ఐఎస్ కబంధ హస్తాల నుంచి ఆల్ బాబ్ను టర్కీ తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్నారు. జిహాదీ గ్రూపులు సృష్టించిన పేలుళ్ల ద్వారా అధిక మొత్తంలో వచ్చిన కాలుష్యం వల్ల 40వేల మంది నగరం నుంచి వెళ్లిపోయినట్టు ఓసీహెచ్ఏ నివేదిక చెబుతోంది.
ఐఎస్ అంతం చేయాలని సంకల్పించిన నేపథ్యంలో చెలరేగిన విధ్వంసం వల్ల తూర్పు ఆల్బాబ్ నగరం 26వేలమంది వెళ్లిపోయారు. యూఎస్ సాయంతో సిరియన్ బలగాల ఆధీనంలో ఉన్న మాంబ్జీ పరిసర ప్రాంతాలకు శరణార్థులుగా వలస వెళ్లారని ఓసీహెచ్ఏ అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్









