జయలలిత మెడికల్ రిపోర్టు ప్రభుత్వం చేతిలో
- March 06, 2017
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత చికిత్సపై ఢిల్లీ ఎయిమ్స్ తమ వైద్యులు సమర్పించిన నివేదికను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. జయలలితకు చికిత్స అందించేందుకు ఐదు సార్లు చెన్నై వచ్చిన ఎయిమ్స్ వైద్యులు ఆమె ఆరోగ్య పరిస్థితిపై జరిపిన విశ్లేషణ ఈ నివేదికలో ఉంది. తమిళనాడు ప్రభుత్వం తమ అధికారిక రికార్డుల కోసం ఎయిమ్స్ వైద్యుల విజిట్ నోట్స్ అడిగిందని... సదరు పత్రాలను తమిళనాడు ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ జే రాధా కృష్ణన్కు అప్పగించినట్టు ఎయిమ్స్ డిప్యూటీ డైరెక్టర్ (ఆడ్మిష్ట్రేషన్) వి శ్రీనివాస్ వెల్లడించారు. కాగా జయలలితకు చికిత్స అందించే విషయంలో కుట్ర జరిగిందంటూ మాజీ సీఎం పన్నీర్సెల్వం చేసిన ఆరోపణలను తమిళనాడు ప్రభుత్వం ఖండించింది.
జయలలిత మృతిపై విచారణ జరపాలంటూ ప్రతిపక్ష డీఎంకే సైతం మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. ఇదే విషయంపై పన్నీర్ సెల్వం మద్దతుదారులైన ఎంపీలు రాష్ట్రపతిని కలిసి 'అమ్మ' మృతిపై విచారణ జరిపించాలని కోరారు. ఈ నేపథ్యంలో ఎయిమ్స్ వైద్యుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక తెప్పించుకోవడం ఆసక్తిని రేకెత్తించింది.
తాజా వార్తలు
- 55 రోజుల తర్వాత కువైట్ విమానాశ్రయం పునఃప్రారంభం
- నకిలీ పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల పై ప్రజలకు దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం
- చెన్నై పై గుజరాత్ ఘన విజయం
- కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!









