బంపర్ ఆఫర్ ఎయిర్టెల్లో
- March 06, 2017
జియో దెబ్బకు దిగివస్తున్న మిగితా టెలికాం కంపెనీలు రకరకాల ఆఫర్లతో ఖాతాదారులను రక్షించుకునే పనిలో పడ్డాయి. ఈ ప్రభావం దిగ్గజ టెలికాం 'ఎయిర్టెల్'పై బాగానే పడింది. దీంతో ఎయిర్టెల్ సైతం అనేక ఆఫర్లను ప్రకటించింది. రూ.345 రీఛార్జ్ ప్యాక్పై రోజూ 1 జీబీ డేటా, అదనంగా కాల్స్ సదుపాయం కూడా ఇందులో భాగమే. అయితే ఇప్పుడు మరో సర్ప్రైజింగ్ ఆఫర్ను ప్రకటించింది. ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ యూజర్లకు ఉచిత డేటాను అందించడం ఈ ఆఫర్ ముఖ్య ఉద్దేశం. మార్చి 13 నుంచి యూజర్లకు ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి ఖాతాదారులకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందించనున్నారు. 'మై ఎయిర్టెల్' యాప్ ద్వారా వివరాలు స్పష్టం కానున్నట్లు సమాచారం.
దేశంలోని అత్యంత వేగంగా మొబైల్ నెట్వర్క్ నుంచి ఈ సేవలను పొందవచ్చని, ఎయిర్టెల్ ఖాతాదారులు పంపిన ఈ మెయిల్ సమాచారంలో తెలిపింది. అయితే మార్చి 13నుంచి అందుబాటులోకి రానున్న ఈ ఆశ్చర్యకరమైన ఆఫర్ లో డ్యాటా సేవలు ఏ మేరకు అందించనుంది అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
తాజా వార్తలు
- దుబాయ్ స్కూళ్లలో పీఈ క్లాసులకు ఆమోదం..!!
- సౌదీలో 500కు పైగా హెరిటేజ్ ప్రదేశాల్లో పునరుజ్జీవ కార్యక్రమాలు..!!
- బహ్రెయిన్ లో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం..!!
- షార్జాలో Dh3 మిలియన్ ఫ్రాడ్..క్రిమినల్ నెట్వర్క్ అరెస్టు..!!
- కువైట్కు సంఘీభావంగా బెంగాలీ సొసైటీ..క్రాఫ్ట్ వర్క్షాప్..!!
- ఇబ్రా, అల్ ముధైబి ఆరోగ్య కేంద్రాల్లో త్వరలో వైద్యసేవలు..!!
- 55 రోజుల తర్వాత కువైట్ విమానాశ్రయం పునఃప్రారంభం
- నకిలీ పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల పై ప్రజలకు దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం









