బంపర్ ఆఫర్ ఎయిర్టెల్లో
- March 06, 2017
జియో దెబ్బకు దిగివస్తున్న మిగితా టెలికాం కంపెనీలు రకరకాల ఆఫర్లతో ఖాతాదారులను రక్షించుకునే పనిలో పడ్డాయి. ఈ ప్రభావం దిగ్గజ టెలికాం 'ఎయిర్టెల్'పై బాగానే పడింది. దీంతో ఎయిర్టెల్ సైతం అనేక ఆఫర్లను ప్రకటించింది. రూ.345 రీఛార్జ్ ప్యాక్పై రోజూ 1 జీబీ డేటా, అదనంగా కాల్స్ సదుపాయం కూడా ఇందులో భాగమే. అయితే ఇప్పుడు మరో సర్ప్రైజింగ్ ఆఫర్ను ప్రకటించింది. ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ యూజర్లకు ఉచిత డేటాను అందించడం ఈ ఆఫర్ ముఖ్య ఉద్దేశం. మార్చి 13 నుంచి యూజర్లకు ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి ఖాతాదారులకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందించనున్నారు. 'మై ఎయిర్టెల్' యాప్ ద్వారా వివరాలు స్పష్టం కానున్నట్లు సమాచారం.
దేశంలోని అత్యంత వేగంగా మొబైల్ నెట్వర్క్ నుంచి ఈ సేవలను పొందవచ్చని, ఎయిర్టెల్ ఖాతాదారులు పంపిన ఈ మెయిల్ సమాచారంలో తెలిపింది. అయితే మార్చి 13నుంచి అందుబాటులోకి రానున్న ఈ ఆశ్చర్యకరమైన ఆఫర్ లో డ్యాటా సేవలు ఏ మేరకు అందించనుంది అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!