బంపర్ ఆఫర్ ఎయిర్టెల్లో
- March 06, 2017
జియో దెబ్బకు దిగివస్తున్న మిగితా టెలికాం కంపెనీలు రకరకాల ఆఫర్లతో ఖాతాదారులను రక్షించుకునే పనిలో పడ్డాయి. ఈ ప్రభావం దిగ్గజ టెలికాం 'ఎయిర్టెల్'పై బాగానే పడింది. దీంతో ఎయిర్టెల్ సైతం అనేక ఆఫర్లను ప్రకటించింది. రూ.345 రీఛార్జ్ ప్యాక్పై రోజూ 1 జీబీ డేటా, అదనంగా కాల్స్ సదుపాయం కూడా ఇందులో భాగమే. అయితే ఇప్పుడు మరో సర్ప్రైజింగ్ ఆఫర్ను ప్రకటించింది. ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ యూజర్లకు ఉచిత డేటాను అందించడం ఈ ఆఫర్ ముఖ్య ఉద్దేశం. మార్చి 13 నుంచి యూజర్లకు ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి ఖాతాదారులకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందించనున్నారు. 'మై ఎయిర్టెల్' యాప్ ద్వారా వివరాలు స్పష్టం కానున్నట్లు సమాచారం.
దేశంలోని అత్యంత వేగంగా మొబైల్ నెట్వర్క్ నుంచి ఈ సేవలను పొందవచ్చని, ఎయిర్టెల్ ఖాతాదారులు పంపిన ఈ మెయిల్ సమాచారంలో తెలిపింది. అయితే మార్చి 13నుంచి అందుబాటులోకి రానున్న ఈ ఆశ్చర్యకరమైన ఆఫర్ లో డ్యాటా సేవలు ఏ మేరకు అందించనుంది అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
తాజా వార్తలు
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!







