ఇకపై నిస్సంకోచంగా డబ్బుల్ని పంపించొచ్చు
- March 06, 2017
భారతదేశంలో డిమానిటైజేషన్ కారణంగా ఏర్పడ్డ కరెన్సీ సంక్షోభంతో యూఏఈలోనూ ఇండియన్స్ పలు సమస్యల్ని ఎదుర్కొన్నారు. తమవారికి డబ్బులు పంపించడానికోసం నానా పాట్లూ పడాల్సి వచ్చింది వారంతా. అయితే నగదు ఉపసంహరణ పరిమితిని సడలించడంతో ఇకపై ఎంత మొత్తమైనాసరే భారతదేశానికి నగదు పంపించుకోవడానికి వీలు కలిగింది. 55,000 ఎక్స్ప్రెస్ మనీ ఔట్లెట్స్ ద్వారా ఎవరైనాసరే ఎంతమొత్తమైనా కలెక్ట్ చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. నోట్ల రద్దు, నగదు కొరత కారణంగా వినియోగదారులు ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చిందనీ, రిజర్వు బ్యాంకు నిబంధనల్ని సడలించడంతో పరిస్థితి పూర్తిగా మెరుగుపడిందని ఎక్స్ప్రెస్ మనీ నిర్వాహకులు తెలిపారు. ఫిబ్రవరి 20 నుంచి రిజర్వు బ్యాంకు రోజువారీ నగదు ఉపసంహరణ పరిమితిని 50,000 వరకు పెంచింది. మార్చ్ 13తో ఈ పరిమితి పూర్తిగా తొలగిపోనుంది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







