ఇకపై నిస్సంకోచంగా డబ్బుల్ని పంపించొచ్చు
- March 06, 2017
భారతదేశంలో డిమానిటైజేషన్ కారణంగా ఏర్పడ్డ కరెన్సీ సంక్షోభంతో యూఏఈలోనూ ఇండియన్స్ పలు సమస్యల్ని ఎదుర్కొన్నారు. తమవారికి డబ్బులు పంపించడానికోసం నానా పాట్లూ పడాల్సి వచ్చింది వారంతా. అయితే నగదు ఉపసంహరణ పరిమితిని సడలించడంతో ఇకపై ఎంత మొత్తమైనాసరే భారతదేశానికి నగదు పంపించుకోవడానికి వీలు కలిగింది. 55,000 ఎక్స్ప్రెస్ మనీ ఔట్లెట్స్ ద్వారా ఎవరైనాసరే ఎంతమొత్తమైనా కలెక్ట్ చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. నోట్ల రద్దు, నగదు కొరత కారణంగా వినియోగదారులు ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చిందనీ, రిజర్వు బ్యాంకు నిబంధనల్ని సడలించడంతో పరిస్థితి పూర్తిగా మెరుగుపడిందని ఎక్స్ప్రెస్ మనీ నిర్వాహకులు తెలిపారు. ఫిబ్రవరి 20 నుంచి రిజర్వు బ్యాంకు రోజువారీ నగదు ఉపసంహరణ పరిమితిని 50,000 వరకు పెంచింది. మార్చ్ 13తో ఈ పరిమితి పూర్తిగా తొలగిపోనుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!
- ఖతార్ లో 31 ఆహార సంస్థలు సీజ్..!!
- మా యాత్రికులు సౌదీ నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నారు: ఇరాన్
- బీమా రంగంలో నగదు లావాదేవీలపై నిషేధం..!!
- ఈద్ అల్ అదా: మలేరియా నుంచి రక్షణకు డాక్టర్ల సూచనలు..!!
- అమెరికా-ఇరాన్ చర్చలపై సయ్యద్ బదర్ సమీక్ష..!!
- డిజిటల్ మార్కెటింగ్ పేరిట మోసం..కంపెనీ మేనేజర్ అరెస్ట్
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు
- తెలంగాణలో యువతకు శిక్షణ.. అనంతరం జపాన్, జర్మనీలో ఉద్యోగాలు









