120 కిలోల బరువు తగ్గిన ప్రపంచ భారీకాయురాలు
- March 06, 2017
ప్రపంచంలోనే అత్యంత భారీకాయురాలైన ఈజిప్టు మహిళ ఈమన్ అహ్మద్ నెలరోజుల కాలంలో 120 కిలోల బరువు తగ్గారని ఆమెకు చికిత్స చేస్తున్న సైఫీ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. జన్యు పరీక్షల నివేదిక రాగానే ఈమెకు బేరియాట్రిక్ శస్త్రచికిత్స చేయాలని వైద్యులు నిర్ణయించారు. ఈజిప్టు దేశంలోని అలెగ్జాండ్రియా నగరానికి చెందిన భారీకాయురాలైన ఈమన్ అహ్మద్ ను 25 ఏళ్ల తర్వాత మొదటిసారి ప్రత్యేక విమానంలో ముంబయికు తరలించి చికిత్స చేస్తున్న సంగతి పాఠకులకు విదితమే.
భారీకాయం వల్ల ఈమన్ అహ్మద్ కు ఎమ్మారై పరీక్ష చేసేందుకు వీలుకాకపోవడం వల్ల పోర్టబుల్ ఎక్స్ రేలు తీస్తూ వైద్యులు చికిత్స చేస్తున్నారు. ఎప్పటికప్పుడు రోగి బరువును పరిశీలించేందుకు వీలుగా ఆమె పడుకున్న మంచానికే తూకపు యంత్రాన్ని బిగించారు.నిరంతరం ఫిజియోథెరపీ చేయడం వల్ల ఆమె సులవుగా ఆహారం తీసుకోవడంతోపాటు మాట స్పష్టంగా వస్తుందని డాక్టర్ ముఫజల్ లక్డావాలా చెప్పారు. మందుల వల్ల శరీరంలో ఉన్న ద్రవపదార్థాల శాతం తగ్గి మరో వందకిలోల బరువు తగ్గుతుందని డాక్టర్ లక్డావాలా వివరించారు. ఈమె చికిత్సకు దాతలు రూ.60 లక్షల రూపాయల దాకా విరాళం అందిందని వైద్యులు వివరించారు.
తాజా వార్తలు
- కల్తీ లిక్కర్ మాఫియా పై సీఎం చంద్రబాబు సీరియస్..
- రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి-2025 ప్రకటన..
- భారత్ లోనే తొలి డిజిటల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం
- విదేశీ ఉద్యోగులకు హెచ్1బీ వీసా స్పాన్సర్ చేస్తాం: ఎన్విడియా CEO
- దుబాయ్లో తెలంగాణ వాసి మృతి
- పియూష్ గోయల్తో ఖతార్ కామర్స్ మినిస్టర్ భేటీ..!!
- ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక..స్వాగతించిన సౌదీ క్యాబినెట్..!!
- Dh1కి 10 కిలోల అదనపు లగేజ్..ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్..!!
- ముబారక్ అల్-కబీర్ లో క్లీనప్ డ్రైవ్..!!
- బహ్రెయిన్-సౌదీ సంబంధాలు చారిత్రాత్మకం..!!