ఇండియన్ ఫుడ్ ఫెస్టివల్కి రంగం సిద్ధం
- March 07, 2017ఐదు రోజులపాటు జరిగే ఇండియన్ ఫుడ్ ఫెస్టివల్కి రంగం సిద్ధమయ్యింది. గ్రాండ్ హయాత్ మస్కట్లో మార్చ్ 15 నుంచి ఈ ఫెస్టివల్ జరుగుతుంది. ఒమన్లో ఇండియా అంబాసిడర్ ఇంద్రా మణి పాండే ఈ విషయాన్ని వెల్లడించారు. ఇండియన్ ఎంబసీ - భారత మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తోంది. వెస్ట్ బెంగాల్, జమ్మూ అండ్ కాశ్మీర్, గుజరాత్, రాజస్తాన్ మరియు గోవా తదితర రాష్ట్రాలనుంచి అంతగా ప్రాచుర్యం లేని ప్రత్యేక ఆహార పదార్థాల్ని ఇక్కడ ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నామని పాండే తెలిపారు. అలాగే మిగతా రాష్ట్రాల్లోని ప్రత్యేక వంటకాలకు లోటు ఏమీ ఉండదనీ, కేరళ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఆహార పదార్థాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి. మెనూ చాలా కొత్తగా ఉంటుందనీ, ఎవరూ ఊహించని విధంగా ఏర్పాటు చేసే మెనూ అందరికీ నచ్చుతుందని నిర్వాహకులు తెలిపారు. ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కోఆపరేషన్ ద్వారా ఇద్దరు చెఫ్లను ఎంపిక చేశారు. వారిద్దరూ ఈ ఫెస్టివల్లో పాల్గొంటారు. గ్రాండ్ హయాత్ చెఫ్స్తో కలిసి వారు పనిచేస్తారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..