వలసదారుడి భౌతిక కాయం తరలింపు
- March 07, 2017
భారతీయ వలసదారుడు గురుస్వామి మూక్కాన్ మృతదేహాన్ని స్వదేశానికి తరలించనున్నారు. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో గుండెపోటుకి గురై గురుస్వామి మృతి చెందారు. గురుస్వామి మృతదేహాన్ని చెన్నయ్ విమానాశ్రయంలో ఆయన సోదరుడు సుబ్రహ్మణ్యం రిసీవ్ చేసుకుంటారని సామాజిక కార్యకర్త బషీర్ అంబలాయి చెప్పారు. గత శుక్రవారం గురుస్వామి, బహ్రెయిన్లో గుండెపోటుతో మృతి చెందడం జరిగింది. సౌదీ వీసా రెన్యువల్ అనంతరం గల్ఫ్ ఎయిర్ విమానంలో రియాద్ నుంచి పయనమయ్యారు. అయితే మార్చ్ 3న బహ్రెయిన్ నుంచి చెన్నయ్కి వెళుతుండగా, బహ్రెయిన్ విమానాశ్రయంలో గుండెపోటు వచ్చింది. బహ్రెయిన్లోని ఆసుపత్రికి అతన్ని తరలించగా, అక్కడే ఆయన మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. తమిళనాడులోని కూక్కడికి చెందిన వ్యక్తి గురుస్వామి. మృతుడి కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలిపింది గల్ఫ్ ఎయిర్.
తాజా వార్తలు
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!









