వలసదారుడి భౌతిక కాయం తరలింపు
- March 07, 2017
భారతీయ వలసదారుడు గురుస్వామి మూక్కాన్ మృతదేహాన్ని స్వదేశానికి తరలించనున్నారు. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో గుండెపోటుకి గురై గురుస్వామి మృతి చెందారు. గురుస్వామి మృతదేహాన్ని చెన్నయ్ విమానాశ్రయంలో ఆయన సోదరుడు సుబ్రహ్మణ్యం రిసీవ్ చేసుకుంటారని సామాజిక కార్యకర్త బషీర్ అంబలాయి చెప్పారు. గత శుక్రవారం గురుస్వామి, బహ్రెయిన్లో గుండెపోటుతో మృతి చెందడం జరిగింది. సౌదీ వీసా రెన్యువల్ అనంతరం గల్ఫ్ ఎయిర్ విమానంలో రియాద్ నుంచి పయనమయ్యారు. అయితే మార్చ్ 3న బహ్రెయిన్ నుంచి చెన్నయ్కి వెళుతుండగా, బహ్రెయిన్ విమానాశ్రయంలో గుండెపోటు వచ్చింది. బహ్రెయిన్లోని ఆసుపత్రికి అతన్ని తరలించగా, అక్కడే ఆయన మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. తమిళనాడులోని కూక్కడికి చెందిన వ్యక్తి గురుస్వామి. మృతుడి కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలిపింది గల్ఫ్ ఎయిర్.
తాజా వార్తలు
- జాయింట్ భద్రతా ప్రాజెక్టుల్లో డేటా రక్షణకు యూఏఈ–ఖతర్ అవగాహన ఒప్పందం
- వాట్సాప్లో అద్భుతమైన ఫీచర్..
- చికాగోలో NATS అడాప్ట్ ఎ హైవే కు మంచి స్పందన
- షార్జా యూనివర్సిటీ ఆసుపత్రి విస్తరణకు AED 300 మిలియన్ల మంజూరు
- ‘దుబాయ్-ఇట్’ వ్యూహాన్ని ఆవిష్కరించిన షేక్ మొహమ్మద్
- కృష్ణలంక ఘటన పై ఏపీ ప్రభుత్వం సీరియస్..
- NEET పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
- ఇరాన్ విషయంలో మరో బాంబ్ పేల్చిన ట్రంప్
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు









