కన్నడ సినీ పరిశ్రమలో తెలుగు దర్శకుడి సరికొత్త రికార్డు
- March 08, 2017
భారత సినీ పరిశ్రమలో వంద చిత్రాల వరకు దర్శకత్వం వహించిన వారిని వేళ్లపై లెక్కపెట్టవచ్చు. టాలీవుడ్లో ప్రముఖ దర్శకులు దాసరి నారాయణ, కోడి రామకృష్ణ, రాఘవేంద్రరావులు ఈ అరుదైన రికార్డును సాధించారు. ఇక కోలీవుడ్లో ప్రఖ్యాత దర్శకుడు బాలచందర్, రామనారాయణ్లు ఈ ఖ్యాతిని అందుకున్నారు. సాండల్వుడ్లో కూడా ఈ అరుదైన ఖ్యాతిని ప్రముఖ దర్శకుడు సాయిప్రకాశ్ త్వరలో తన సొంతం చేసుకోబోతున్నారు.
కన్నడ సినీ పరిశ్రమలో సెంచరీ చిత్రాల దర్శకత్వం జాబితాలో చోటు సంపాదించుకోబోతున్న సాయిప్రకాశ్ తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణం. ఆయన దర్శకత్వం వహించిన 98వ చిత్రం 'రియల్ పోలీస్' ఈనెల 10న విడుదల కానున్న నేపథ్యంలో బుధవారం ఆయన ఆంధ్రజ్యోతికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో జన్మించిన సాయిప్రకాశ్ హిందూకాలేజీలో విద్యాభ్యాసం చేశారు. బిఎస్సి వరకు చదువుకున్న ఆయనకు చిన్నప్పటి నుంచి నాటకరంగమంటే అమితమైన ఆసక్తి.
ఇదే ఆయనను సినిమారంగంవైపు నడిపించింది. 1971లో చెన్నైకు చేరుకున్న ఆయన 1988లో బెంగళూరుకు వచ్చి స్థిరపడ్డారు. కన్నడనాట తొలిచిత్రం 'ముత్తినంత మనుష్య' కు దర్శకత్వం వహించారు. అలా నిరాంటకంగా ఆయన సినీపయనం కొనసాగింది.
తాజా వార్తలు
- యూఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- ఖతార్లో మళ్లీ UFC ఫైట్ నైట్..!!
- ఒమన్లో వాహనదారులకు అలర్ట్.. నవంబర్ 18 స్ట్రీట్లో ట్రాఫిక్ మళ్లింపు..!!
- అబుదాబిలో హాలిడే హోమ్ నిబంధనలు మార్పు..!!
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము







