చికాగో ఆంధ్ర సంఘం ఆందోళన భారతీయులపై జరుగుతున్న దాడులపై

- March 08, 2017 , by Maagulf
చికాగో ఆంధ్ర సంఘం ఆందోళన భారతీయులపై జరుగుతున్న దాడులపై

అమెరికాలో భారతీయులపై జరుగుతున్న దాడులపై చికాగో ఆంధ్ర సంఘం, ఇండియన్ కమ్యూనిటీ అవుడ్ రీచ్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అరోరా సిటీలో ICO అధ్యక్షుడు కృష్ణ బన్సల్ అధ్యక్షత ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి యుఎస్ కాంగ్రెస్ సభ్యులు రాజా క్రిష్ణమూర్తితోపాటు తానా అధ్యక్షుడు జంపాల చౌదరి, ఇమ్మిగ్రేషన్ ఆటార్నీ భాను ఇలింద్రతోపాటు అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ కూచిభొట్లకు నివాళులు అర్పించారు. భారతీయులు అప్రమత్తంగా ఉండాలని.. వీలైనంత వరకు  వివాదాలకు, అనవసర ప్రసంగాలకి దూరంగా ఉండటం మంచిదని తానా అధ్యక్షుడు జంపాల చౌదరి సూచించారు. అన్నారు. ఇమ్మిగ్రేషన్ అటార్నీ భాను మాట్లాడుతూ.. ట్రంప్ విధానాల వల్ల భారతీయులకు ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రమాదమేమి లేదన్నారు. H1B, గ్రీన్ కార్డు వాళ్లు నిరభ్యంతరంగా ఉద్యోగాలు చేసుకోవచ్చన్నారు. మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని.. ఎదైనా అనుమానాలుంటే తమ కంపెనీకి చెందిన లాయర్ల సలహా తీసుకోవాలి అని సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com