చికాగో ఆంధ్ర సంఘం ఆందోళన భారతీయులపై జరుగుతున్న దాడులపై
- March 08, 2017
అమెరికాలో భారతీయులపై జరుగుతున్న దాడులపై చికాగో ఆంధ్ర సంఘం, ఇండియన్ కమ్యూనిటీ అవుడ్ రీచ్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అరోరా సిటీలో ICO అధ్యక్షుడు కృష్ణ బన్సల్ అధ్యక్షత ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి యుఎస్ కాంగ్రెస్ సభ్యులు రాజా క్రిష్ణమూర్తితోపాటు తానా అధ్యక్షుడు జంపాల చౌదరి, ఇమ్మిగ్రేషన్ ఆటార్నీ భాను ఇలింద్రతోపాటు అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ కూచిభొట్లకు నివాళులు అర్పించారు. భారతీయులు అప్రమత్తంగా ఉండాలని.. వీలైనంత వరకు వివాదాలకు, అనవసర ప్రసంగాలకి దూరంగా ఉండటం మంచిదని తానా అధ్యక్షుడు జంపాల చౌదరి సూచించారు. అన్నారు. ఇమ్మిగ్రేషన్ అటార్నీ భాను మాట్లాడుతూ.. ట్రంప్ విధానాల వల్ల భారతీయులకు ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రమాదమేమి లేదన్నారు. H1B, గ్రీన్ కార్డు వాళ్లు నిరభ్యంతరంగా ఉద్యోగాలు చేసుకోవచ్చన్నారు. మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని.. ఎదైనా అనుమానాలుంటే తమ కంపెనీకి చెందిన లాయర్ల సలహా తీసుకోవాలి అని సూచించారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







