చికాగో ఆంధ్ర సంఘం ఆందోళన భారతీయులపై జరుగుతున్న దాడులపై
- March 08, 2017
అమెరికాలో భారతీయులపై జరుగుతున్న దాడులపై చికాగో ఆంధ్ర సంఘం, ఇండియన్ కమ్యూనిటీ అవుడ్ రీచ్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అరోరా సిటీలో ICO అధ్యక్షుడు కృష్ణ బన్సల్ అధ్యక్షత ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి యుఎస్ కాంగ్రెస్ సభ్యులు రాజా క్రిష్ణమూర్తితోపాటు తానా అధ్యక్షుడు జంపాల చౌదరి, ఇమ్మిగ్రేషన్ ఆటార్నీ భాను ఇలింద్రతోపాటు అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ కూచిభొట్లకు నివాళులు అర్పించారు. భారతీయులు అప్రమత్తంగా ఉండాలని.. వీలైనంత వరకు వివాదాలకు, అనవసర ప్రసంగాలకి దూరంగా ఉండటం మంచిదని తానా అధ్యక్షుడు జంపాల చౌదరి సూచించారు. అన్నారు. ఇమ్మిగ్రేషన్ అటార్నీ భాను మాట్లాడుతూ.. ట్రంప్ విధానాల వల్ల భారతీయులకు ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రమాదమేమి లేదన్నారు. H1B, గ్రీన్ కార్డు వాళ్లు నిరభ్యంతరంగా ఉద్యోగాలు చేసుకోవచ్చన్నారు. మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని.. ఎదైనా అనుమానాలుంటే తమ కంపెనీకి చెందిన లాయర్ల సలహా తీసుకోవాలి అని సూచించారు.
తాజా వార్తలు
- కువైట్లో 172 బాటిళ్ల లిక్కర్ సీజ్.. ప్రవాసుడు అరెస్ట్..!!
- అంగోలాకు చేరుకున్న ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్..!!
- సౌదీలో ఎక్స్పాట్ డాక్టర్పై విచారణ..!!
- యూఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- ఖతార్లో మళ్లీ UFC ఫైట్ నైట్..!!
- ఒమన్లో వాహనదారులకు అలర్ట్.. నవంబర్ 18 స్ట్రీట్లో ట్రాఫిక్ మళ్లింపు..!!
- అబుదాబిలో హాలిడే హోమ్ నిబంధనలు మార్పు..!!
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం







