భజన గీతాలు పాడిన ముస్లిమ్ బాలిక
- March 08, 2017
హిజాబ్ ధరించిన ఓ ముస్లిమ్ బాలిక కన్నడ టీవీ ఛానల్ రియాల్టీ షోలో హిందూమతానికి చెందిన భజన గీతాలు పాడి అందరినీ ఆకట్టుకున్న ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లా సాగర్ తాలూకాకు చెందిన సయ్యద్ సుహానా హిజాబ్ ధరించి వచ్చి ఓ కన్నడ టీవీ ఛానల్ లో హిందూమత భజన గీతాలు పాడింది. ముస్లిమ్ బాలిక సుహానా భజన గీతాలు పాడి హిందూ ముస్లిమ్ ల ఐక్యతకు మారుపేరుగా నిలిచారని రియాల్టీ షో జడ్జీలు అభినందించారు. కాగా ఇలా భజనగీతాలు పాడటం తప్పని మంగళూరు ముస్లిమ్ లు కొందరు ఫేస్ బుక్ పేజీలో వ్యాఖ్యలు చేశారు. నెటిజన్లు ముస్లిమ్ బాలికకు అండగా నిలవడంతో మంగళూరు ముస్లిమ్ లు పెట్టిన కామెంట్లను తొలగించారు.
మొత్తంమీద సుహానా భక్తిగీతాలు పాడి మతసామరస్యాన్ని మరోసారి సమాజానికి చాటిచెప్పింది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







