శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బంగారం పట్టివేత
- September 23, 2015
శంషాబాద్ ఎయిర్పోర్టులో మరో సారి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చిన ఒక జంటను కస్టమ్స్ అధికారులు అతనిని తనిఖీ చేశారు. వారి వద్ద ఆభరణాల రూపంలో బంగారం ఉండటంతో పాటు బంగారం బిస్కట్లు కూడా ఉన్నాయి. వాటిని ఆభరణాలను బిస్కట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులను పోలీసు లకు అప్పగించారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం ఒక కిలో 76 గ్రాములు ఉన్నట్లు అధికా రులు తెలిపారు. కాగా ఈ విధంగా శంషాబాద్ ఎయిర్ పోర్టు ద్వారా బంగారం స్మగ్లింగ్ జరగడం పరి పాటిగా మారింది. దీంతో స్మగ్లింగ్పై పూర్తి నియంత్రణ తెచ్చేందుకు కస్టమ్స్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అయితే దక్షణ భారత దేశంలో స్మగ్లింగ్కు అనుకూలమైన అంతర్జాతీయ విమానాశ్రయాలలో శంషాబాదు ఎయిర్ పోర్టు మొదటి స్థానంలో ఉంది. అక్కడి అధికారుల చేతకానితనమా లేక స్మగ్లర్లకు అక్కడ అధికారుల నుంచి సహకారం అందుతుందా, అదీ కాక సాంకేతిక సమస్యలా అన్న దానిపై స్పష్టత లేనప్పటికి శంషాబాద్ ఎయిర్ పోర్టు ద్వారా జరిగి స్మగ్లింగ్లో కేవలం 10 శాతం మాత్రం పట్టుబడుతుందని 90 శాతం యదేశ్చగా మార్కెట్కు తరలుతుందన్న చర్చ సాగుతోంది. ఇప్పటికైనా అక్కడి అధికారులు బంగారం స్మగ్లింగ్కు అరికట్టడంలో తమ సత్తా చాటుకోవాల్సిన అవసరం ఉంది.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







