శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బంగారం పట్టివేత
- September 23, 2015
శంషాబాద్ ఎయిర్పోర్టులో మరో సారి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చిన ఒక జంటను కస్టమ్స్ అధికారులు అతనిని తనిఖీ చేశారు. వారి వద్ద ఆభరణాల రూపంలో బంగారం ఉండటంతో పాటు బంగారం బిస్కట్లు కూడా ఉన్నాయి. వాటిని ఆభరణాలను బిస్కట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులను పోలీసు లకు అప్పగించారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం ఒక కిలో 76 గ్రాములు ఉన్నట్లు అధికా రులు తెలిపారు. కాగా ఈ విధంగా శంషాబాద్ ఎయిర్ పోర్టు ద్వారా బంగారం స్మగ్లింగ్ జరగడం పరి పాటిగా మారింది. దీంతో స్మగ్లింగ్పై పూర్తి నియంత్రణ తెచ్చేందుకు కస్టమ్స్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అయితే దక్షణ భారత దేశంలో స్మగ్లింగ్కు అనుకూలమైన అంతర్జాతీయ విమానాశ్రయాలలో శంషాబాదు ఎయిర్ పోర్టు మొదటి స్థానంలో ఉంది. అక్కడి అధికారుల చేతకానితనమా లేక స్మగ్లర్లకు అక్కడ అధికారుల నుంచి సహకారం అందుతుందా, అదీ కాక సాంకేతిక సమస్యలా అన్న దానిపై స్పష్టత లేనప్పటికి శంషాబాద్ ఎయిర్ పోర్టు ద్వారా జరిగి స్మగ్లింగ్లో కేవలం 10 శాతం మాత్రం పట్టుబడుతుందని 90 శాతం యదేశ్చగా మార్కెట్కు తరలుతుందన్న చర్చ సాగుతోంది. ఇప్పటికైనా అక్కడి అధికారులు బంగారం స్మగ్లింగ్కు అరికట్టడంలో తమ సత్తా చాటుకోవాల్సిన అవసరం ఉంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









