శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బంగారం పట్టివేత
- September 23, 2015
శంషాబాద్ ఎయిర్పోర్టులో మరో సారి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చిన ఒక జంటను కస్టమ్స్ అధికారులు అతనిని తనిఖీ చేశారు. వారి వద్ద ఆభరణాల రూపంలో బంగారం ఉండటంతో పాటు బంగారం బిస్కట్లు కూడా ఉన్నాయి. వాటిని ఆభరణాలను బిస్కట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులను పోలీసు లకు అప్పగించారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం ఒక కిలో 76 గ్రాములు ఉన్నట్లు అధికా రులు తెలిపారు. కాగా ఈ విధంగా శంషాబాద్ ఎయిర్ పోర్టు ద్వారా బంగారం స్మగ్లింగ్ జరగడం పరి పాటిగా మారింది. దీంతో స్మగ్లింగ్పై పూర్తి నియంత్రణ తెచ్చేందుకు కస్టమ్స్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అయితే దక్షణ భారత దేశంలో స్మగ్లింగ్కు అనుకూలమైన అంతర్జాతీయ విమానాశ్రయాలలో శంషాబాదు ఎయిర్ పోర్టు మొదటి స్థానంలో ఉంది. అక్కడి అధికారుల చేతకానితనమా లేక స్మగ్లర్లకు అక్కడ అధికారుల నుంచి సహకారం అందుతుందా, అదీ కాక సాంకేతిక సమస్యలా అన్న దానిపై స్పష్టత లేనప్పటికి శంషాబాద్ ఎయిర్ పోర్టు ద్వారా జరిగి స్మగ్లింగ్లో కేవలం 10 శాతం మాత్రం పట్టుబడుతుందని 90 శాతం యదేశ్చగా మార్కెట్కు తరలుతుందన్న చర్చ సాగుతోంది. ఇప్పటికైనా అక్కడి అధికారులు బంగారం స్మగ్లింగ్కు అరికట్టడంలో తమ సత్తా చాటుకోవాల్సిన అవసరం ఉంది.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







