బీసీసీఐ వార్షిక అవార్డుల వేడుక కన్నుల పండుగగా జరిగింది
- March 09, 2017
బీసీసీఐ వార్షిక అవార్డుల వేడుక బుధవారం కన్నుల పండుగగా జరిగింది. బెంగుళూరు వేదికగా జరిగిన ఈ అవార్డుల కార్యక్రమానికి క్రీడా ప్రముఖలందరూ హాజరయ్యారు. వీరితో పాటు టీమిండియా, అవార్జు విజేతలు ఈ ఫంక్షన్కు హాజరయ్యారు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పాలీ ఉమ్రిగర్ అవార్డును, స్పిన్నర్ అశ్విన్ 'దిలీప్ సర్దేశాయ్' అవార్డును అందుకున్నారు. పాలీ ఉమ్రిగర్ అవార్డును మూడుసార్లు అందుకున్న ఏకైక క్రికెటర్గా కోహ్లి గుర్తింపు పొందాడు. 2015-16 సీజన్లో అద్భుత ప్రదర్శనకు గాను ఈ అవార్డు వరించింది.
ఇక కల్నల్ సీకే నాయుడు అవార్డును స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్వీకరించాడు. భారత మహిళా క్రికెట్ జట్టు సారథి మిథాలీ రాజ్కు 'బెస్ట్ ఉమన్ క్రికెటర్' అవార్డు దక్కింది.
రాజిందర్ గోయెల్, పద్మాకర్ శివాల్కర్లకు కల్నల్ సీకే నాయుడు జీవిత సాఫల్య పురస్కారం దక్కగా, శాంత రంగస్వామికి మహిళల కేటగిరీలో బీసీసీఐ జీవిత సాఫల్య పురస్కారం లభించింది.
ఇక టైగర్ మన్సూర్ అలీఖాన్ పటౌడీ స్మారక ఉపన్యాసాన్ని భారత మాజీ వికెట్కీపర్ ఫారుఖ్ ఇంజినీర్ వెలువరించారు. బీసీసీఐ వార్షిక అవార్డుల వేడుకకు సంబంధించిన ఫోటోలు మీకోసం:
బీసీసీఐ వార్షిక అవార్డుల వేడుకకు హాజరైన టీమిండియా
బీసీసీఐ వార్షిక అవార్డుల వేడుక బుధవారం కన్నుల పండుగగా జరిగింది. బెంగుళూరులోని రిట్జ్ కార్టన్ హోటల్ వేదికగా జరిగిన ఈ అవార్డుల కార్యక్రమానికి క్రీడా ప్రముఖలందరూ హాజరయ్యారు. వీరితో పాటు టీమిండియా, అవార్జు విజేతలు ఈ ఫంక్షన్కు హాజరయ్యారు.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్కాయిన్ సీజ్ చేసిన అమెరికా