భారీ అగ్నిప్రమాదంలో దాదాపు 22 మంది పిల్లలు సజీవదహనమయ్యారు
- March 09, 2017
అమెరికాలో పెను విషాద ఘటన చోటు చేసుకుంది. గ్వాటెమాలా నగరంలోని సాన్జోస్ పిన్యులా ఆశ్రమంలో బుధవారం చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదంలో దాదాపు 22 మంది పిల్లలు సజీవదహనమయ్యారు. మరో 41 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 14 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ప్రస్తుం వీరంతా సమీపంలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరంతా 18ఏళ్లలోపు వారనేనని చెప్పారు. కాగా, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఈ ఆశ్రమంలో అనాథలు, వేరే ప్రాంతాల నుంచి పారిపోయి వచ్చిన పిల్లలు నివసిస్తున్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే పరుపులకు నిప్పు పెట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు.
500 మందికి నివసించగలిగే సామర్థ్యం ఉన్న ఈ ఆశ్రమంలో ప్రమాదం జరిగిన సమయంలో 800 మంది ఉన్నట్లు గుర్తించారు. ఆశ్రమంలో ఉంటున్న పిల్లల్లో కొందరు తమకంటే చిన్నవారితో తరచూ గొడవ పడుతూ వారిపై ఘర్షణకు దిగుతుంటారని.. ఆ బాధ భరించలేక చాలా మంది చిన్నారులు ఆశ్రమం వదిలి వెళ్లిపోయారని అధికారులు తెలిపారు.
మంగళవారం రాత్రి నుంచే ఆశ్రమంలో అల్లర్లు తీవ్రమైనట్లు అధికారులు చెప్పారు. కాగా, ఇది చాలా విషాదకరమైన ఘటన అని గ్వాటెమాలా జాతీయ పోలీస్ అధికారి నేరీ రోమస్ తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ స్కూళ్లలో పీఈ క్లాసులకు ఆమోదం..!!
- సౌదీలో 500కు పైగా హెరిటేజ్ ప్రదేశాల్లో పునరుజ్జీవ కార్యక్రమాలు..!!
- బహ్రెయిన్ లో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం..!!
- షార్జాలో Dh3 మిలియన్ ఫ్రాడ్..క్రిమినల్ నెట్వర్క్ అరెస్టు..!!
- కువైట్కు సంఘీభావంగా బెంగాలీ సొసైటీ..క్రాఫ్ట్ వర్క్షాప్..!!
- ఇబ్రా, అల్ ముధైబి ఆరోగ్య కేంద్రాల్లో త్వరలో వైద్యసేవలు..!!
- 55 రోజుల తర్వాత కువైట్ విమానాశ్రయం పునఃప్రారంభం
- నకిలీ పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల పై ప్రజలకు దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం









