పాఠశాలలో అగ్ని ప్రమాదం 5 గురు బాలికలకు అస్వస్థత
- March 09, 2017
జహ్రా:స్థానిక ఉమ్ ముబాషేర్ అల్ అన్సారీయా బాలికల హైస్కూల్లో బుధవారం ఒక తరగతిలో అగ్ని రాజుకొని నిమిషాల వ్యవధిలో మంటలు వ్యాపించాయి. వెంటనే అక్కడకు చేరుకొన్న జహ్రా అగ్నిమాపక దళం ముందు జాగ్రత్త చర్యగా పలువురు బాలికలను ఆ ప్రాంతం నుంచి తరలించారు. ఎనిమిది మరియు 10 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న విద్యార్థినులకు ఆయా మంటల నుంచి వెలువడిన పొగను పీల్చడంతో వారు మూర్ఛపోయినట్లుగా నమోదు కాబడింది. పారామెడిక్స్ వారికి తక్షణ వైద్య సహాయం అందించింది. పాఠశాలలో అగ్ని ప్రమాదం జరాజధానికి అసలు కారణం పరిశోధనలు జరుగుతున్నాయి. కువైట్ ఫైర్ సర్వీసెస్ డైరెక్టరేట్ వద్ద పబ్లిక్ రిలేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ శాఖ (చెప్పారు. విద్యా మంత్రిత్వశాఖ ఈ అగ్ని ప్రమాదాన్ని ధ్రువీకరించారు. ఐదుగురు బాలికలకు మెరుగైన వైద్యచికిత్స కోసం సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి సి.పి.రాధకృష్ణన్
- IPL 2026: ఢిల్లీ పై బెంగళూరు ఘన విజయం
- ఎమిరేట్స్ A380లో స్టార్లింక్ వై-ఫై ప్రారంభం
- వందేళ్ల వేడుకలో గుడ్ న్యూస్…ఏయూకి రూ.500 కోట్లు
- శాంతికి రష్యా కృషి…పుతిన్ కీలక ప్రకటన
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై స్పష్టత: ఎంపీ బాలశౌరి
- ఒకే కుటుంబంలో నలుగురు మృతి..కారణం బిర్యానా? పుచ్చకాయ?
- వినోదాల కేంద్రంగా ఇనార్బిట్ మాల్
- సింగపూర్లో మంత్రి సత్యకుమార్తో ప్రవాస తెలుగు సమాజం ముఖాముఖీ కార్యక్రమం
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!









