దోహాలోని ఇండియన్ ఎంబసీకి 3117 ఫిర్యాదులు
- September 23, 2015
భారత ఎంబసీ యొక్క కమ్యూనిటీ సంక్షేమ విభాగానికి ఇప్పటివరకు 3117 ఫిర్యాదులు అందాయి. 2014లో ఈ సంఖ్య 3943గా వుంది. రాయబారి సంజీవ్ అరోరా, డిప్యూటీ చీఫ్ మిషన్ ఆర్ కె సింగ్ మరియు ఇతర అధికారులు, ఫిర్యాదుదారుల్ని కలుసుకుని, వారి సమస్యల గురించి చర్చించారు. ఖతార్ ప్రభుత్వంతో చర్చించి, సమస్యల పరిష్కారానికి మార్గం కనుగొంటామని ఫిర్యాదుదారులకు అధికారులు హామీ ఇచ్చారు. సెప్టెంబర్ వరకు ఎంబసీలో నమోదైన మరణాల సంఖ్య 11. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 209 మరణాలు నమోదయ్యాయి. 2014లో ఈ సంఖ్య 279. ఎంబసీ 22 అత్యవసర సర్టిఫికెట్స్ని, టిక్కెట్స్నీ భారతదేశానికి తిరిగి వెళ్ళేందుకోసం జారీ చేసింది. ఎంబసీ అధికారులు తరచుగా కేంద్ర కారాగారాన్ని సందర్శించి, భారతీయ ఖైదీల సమస్యల గురించి తెలుసుకుంటున్నారు. భారతీయ ఉద్యోగుల సంక్షేమానికి దౌత్య కార్యాలయం ఆధ్వర్యంలో పనిచేసే కమ్యూనిటీ సంఘం సెప్టెంబర్ నెలలో నిరాశ్రయులైన వారి కోసం ఐదు విమాన టిక్కెట్లు జారీ చేసిందని అధ్యక్షుడు అరవింద్ పాటిల్ చెప్పారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









