దోహాలోని ఇండియన్ ఎంబసీకి 3117 ఫిర్యాదులు
- September 23, 2015
భారత ఎంబసీ యొక్క కమ్యూనిటీ సంక్షేమ విభాగానికి ఇప్పటివరకు 3117 ఫిర్యాదులు అందాయి. 2014లో ఈ సంఖ్య 3943గా వుంది. రాయబారి సంజీవ్ అరోరా, డిప్యూటీ చీఫ్ మిషన్ ఆర్ కె సింగ్ మరియు ఇతర అధికారులు, ఫిర్యాదుదారుల్ని కలుసుకుని, వారి సమస్యల గురించి చర్చించారు. ఖతార్ ప్రభుత్వంతో చర్చించి, సమస్యల పరిష్కారానికి మార్గం కనుగొంటామని ఫిర్యాదుదారులకు అధికారులు హామీ ఇచ్చారు. సెప్టెంబర్ వరకు ఎంబసీలో నమోదైన మరణాల సంఖ్య 11. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 209 మరణాలు నమోదయ్యాయి. 2014లో ఈ సంఖ్య 279. ఎంబసీ 22 అత్యవసర సర్టిఫికెట్స్ని, టిక్కెట్స్నీ భారతదేశానికి తిరిగి వెళ్ళేందుకోసం జారీ చేసింది. ఎంబసీ అధికారులు తరచుగా కేంద్ర కారాగారాన్ని సందర్శించి, భారతీయ ఖైదీల సమస్యల గురించి తెలుసుకుంటున్నారు. భారతీయ ఉద్యోగుల సంక్షేమానికి దౌత్య కార్యాలయం ఆధ్వర్యంలో పనిచేసే కమ్యూనిటీ సంఘం సెప్టెంబర్ నెలలో నిరాశ్రయులైన వారి కోసం ఐదు విమాన టిక్కెట్లు జారీ చేసిందని అధ్యక్షుడు అరవింద్ పాటిల్ చెప్పారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







