మోదీకి సారీ చెప్పిన జియో మరియు పేటిఎం కంపెనీలు

- March 10, 2017 , by Maagulf
మోదీకి సారీ చెప్పిన జియో మరియు పేటిఎం కంపెనీలు

ప్రధాని మోదీ ఫొటోని తమ వ్యాపార ప్రకటనల్లో వాడుకున్నందుకు క్షమించాలంటూ రిలయన్స్ జియో, పేటీఎం అభ్యర్థించాయి. సదరు విషయంపై రిలయన్స్ జియో, పేటీఎంలు క్షమాపణ చెప్పినట్టు కేంద్రం ప్రభుత్వం వెల్లడించింది. రిలయన్స్ జియో మోదీ ఫొటోతో వివిధ పత్రికల్లో ఒక ఫుల్ పేజ్ వ్యాపార ప్రకటనను గత నెల సెప్టెంబర్ లో ఇచ్చింది. అలాగే పేటీఎం కూడా రెండు నెలల తర్వాత మోదీ డీమానిటైజేషన్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ తమ డిజిటల్ వాలెట్‌ను వినియోగించాలని పత్రికల్లో అడ్వర్టైజ్ మెంట్ ఇచ్చింది. ఈ వ్యాపార ప్రకటనలు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై పలు కోర్టులలో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు కూడా నమోదయ్యాయి. దీంతో మోదీ ఫోటోగ్రాఫ్ లను తమ అడ్వర్ టైజ్ మెంట్లలో వాడుకున్నందుకు ప్రభుత్వం గత నెల ఆయా కంపెనీలకు నోటీసులు జారీచేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com