ప్రధాని తీవ్ర విచారం జవాన్ల మృతిపై

- March 11, 2017 , by Maagulf
ప్రధాని తీవ్ర విచారం జవాన్ల మృతిపై

ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో మావోయిస్టుల దాడిలో 11 మంది సీఆర్‌పీఎఫ్ జవానులు ప్రాణాలు కోల్పోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పరిస్థితిని సమీక్షించేందుకు హోమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను అక్కడికి పంపుతున్నట్టు ప్రకటించారు. ''సుకుమా జిల్లాలో సీఆర్‌పీఎఫ్ సిబ్బంది మరణించడం నన్ను కలచివేసింది. అమరులైన సైనికులకు నివాళులర్పిస్తున్నాను. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను..'' అని ప్రధాని తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. సుకుమాలో పరిస్థితిని సమీక్షించాలని రాజ్‌నాథ్ సింగ్‌ను కోరాననీ...
ఆయన బయల్దేరి అక్కడికి వెళుతున్నారని పేర్కొన్నారు. సుకుమా జిల్లాలోని గిరిజనులు ఎక్కువగా ఉండే బస్తర్ ప్రాంతంలో భెజ్జి వద్ద మావోయిస్టులు చుట్టుముట్టి దాడికి తెగబడడంతో 11 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com