మక్కా దుర్ఘటనలో హైదరాబాద్ వాసి మృతి
- September 24, 2015
నగరంలోని ఎల్బీ నగర్లో విషాదం నెలకొంది. ఎల్బీనగర్ నుంచి మక్కా యాత్రకు వెళ్లిన జానీబీ మక్కాలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతిచెందారు. ఆమె ఈ నెల 2న కుటుంబ సభ్యులతో కలిసి మక్కా యాత్రకు వెళ్లారు. జానీబీ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు ప్రభుత్వం సత్వరంగా చర్యలు తీసుకోవాలని ఆమె కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా ఇవాళ మక్కాకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మీనా వద్ద సైతాన్ రాయిపై రాళ్లు విసురుతున్న సమయంలో తొక్కిసలాట జరిగి 310 మంది మృతిచెందిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







