మక్కా దుర్ఘటనలో హైదరాబాద్ వాసి మృతి

- September 24, 2015 , by Maagulf
మక్కా దుర్ఘటనలో హైదరాబాద్ వాసి మృతి

నగరంలోని ఎల్బీ నగర్‌లో విషాదం నెలకొంది. ఎల్బీనగర్ నుంచి మక్కా యాత్రకు వెళ్లిన జానీబీ మక్కాలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతిచెందారు. ఆమె ఈ నెల 2న కుటుంబ సభ్యులతో కలిసి మక్కా యాత్రకు వెళ్లారు. జానీబీ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు ప్రభుత్వం సత్వరంగా చర్యలు తీసుకోవాలని ఆమె కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా ఇవాళ మక్కాకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మీనా వద్ద సైతాన్ రాయిపై రాళ్లు విసురుతున్న సమయంలో తొక్కిసలాట జరిగి 310 మంది మృతిచెందిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com