హ్యూమన్ ట్రాఫికింగ్: ఐదుగురు మహిళలకు జైలు
- March 14, 2017
అజ్మన్ క్రిమినల్ కోర్ట్ ఆసియాకి చెందిన ఇద్దరు మహిళలకు ఐదేళ్ళ జైలు శిక్ష విధించింది. జైలు శిక్ష అనంతరం వీరిని దేశం నుంచి బయటకు పంపివేయనున్నారు. అజ్మన్లో బ్రోతల్ హౌస్ నిర్వహిస్తున్నారంటూ వీరిపై మోపబడిన అభియోగాలు నిరూపించబడ్డాయి. తమ దేశం నుంచి వీరు యువతుల్ని ఉద్యోగాల పేరుతో తీసుకొచ్చి, వారిని మభ్యపెట్టి వారితో వ్యభిచారం చేయించారు. ఈ కేసులో మరో ముగ్గురు ఆసియా మహిళలకు మూడేళ్ళ జైలు శిక్ష, శిక్ష అనంతరం డిపోర్టేషన్ని విధించింది న్యాయస్థానం. ఈ కేసులో మొదటి నిందితురాలు దేశంలో అక్రమంగా నివసిస్తోంది. రెసిడెన్సీ వీసా గడువు ముగిసిన తర్వాత అక్రమంగా ఆమె నివసిస్తున్నట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. అజ్మన్లోని ఓ అపార్ట్మెంట్ని రెంట్కి తీసుకుని, అక్కడే ఆమె వ్యభిచార కార్యకలాపాలు నిర్వహించింది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









