వరల్డ్ కిడ్నీ డే: బదర్ అల్ సమా హాస్పిటల్ స్క్రీనింగ్
- March 14, 2017
రువీలోని బదర్ అల్ సమా హాస్పిటల్, వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా మధుమేహం, హైపర్టెన్షన్తో బాధపడుతున్నవారికి కిడ్నీ వ్యాధి పరీక్షల్ని నిర్వహించింది. 200 మంది పేషెంట్లకు స్క్రీనింగ్ చేయగా, అందులో 15 శాతం మందిలో కొన్ని కాంప్లికేషన్లు కన్పించగా, వారిని నెఫ్రాలజిస్ట్ డాక్టర్ వినోద్ చంద్రన్కి రిఫర్ చేశారు. నెఫ్రాలజిస్ట్ వారిని పరీక్షించి, అవసరమైన మందుల్ని అందజేశారు. స్క్రీనింగ్ క్యాంప్ కోసం పూర్తిస్థాయిలో ఏర్పాటు జరిగాయి. డయాబెటిస్, హైపర్టెన్షన్, కిడ్నీ డిజార్డర్, బ్లడ్ ప్రెజర్ లెవల్ చెకప్, బాడీ మాస్ ఇండెక్స్ వంటివి ఇక్కడ పరీక్షించబడ్డాయి. ఆరోగ్యకరమైన సమాజం కోసం అల్ సమా ఆసుపత్రి చేపట్టిన ఈ కార్యక్రమాన్ని పలువురు అభినందించారు. ప్రతి సంవత్సరం వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా, కిడ్నీ ఆరోగ్యం పట్ల అవగాహనా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో తమవంతుగా భాగం పంచుకోవడం ఆనందంగా ఉందని అల్ సమా ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. శరీరంలో కిడ్నీ అనేది అతి కీలకమైన భాగమనీ, ఏమాత్రం కిడ్నీ ఆరోగ్యంపై అశ్రద్ధ వహించరాదని నిపుణులు సూచించారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







