దుబాయ్ వెళ్తున్న గోపీచంద్ 'గౌతమ్ నంద'
- March 14, 2017
గో పీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘గౌతమ్ నంద’. హన్సిక, కేథరిన్ కథానాయికలు. సంపత్నంది దర్శకత్వం వహిస్తున్నారు. జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మాతలు. ప్యాచ్ వర్క్ మినహా టాకీ పూర్తయింది. త్వరలో దుబాయ్లో రెండు పాటల్ని తెరకెక్కిస్తారు. మేలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘‘గోపీచంద్లోని యాక్షన్ కోణాన్ని కొత్తగా చూపించే చిత్రమిది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్లుక్కి మంచి స్పందన వస్తోంది. ఇలాంటి గెటప్లో గోపీచంద్ని ఎప్పుడూ చూళ్లేదని చెబుతున్నారు.
సంపత్నంది చిత్రాన్ని స్టైలిష్గా తీర్చిదిద్దుతున్నారు. ఈనెల ద్వితీయార్ధంలో దుబాయ్లో ఇదివరకెప్పుడూ చూడని కొత్త లొకేషన్లలో రెండు పాటల్ని తెరకెక్కిస్తాం. కథానాయకుడి పరిచయ గీతాన్ని కొత్తగా చూపించబోతున్నాం. ఈ రెండు పాటలకూ రాజు సుందరం నృత్య రీతులు సమకూరుస్తారు.
ఏప్రిల్లో మిగిలిన మూడు పాటల్ని హైదరాబాద్లోనే చిత్రీకరిస్తామ’’న్నారు. సంగీతం: తమన్
తాజా వార్తలు
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్









