దుబాయ్ వెళ్తున్న గోపీచంద్ 'గౌతమ్ నంద'
- March 14, 2017
గో పీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘గౌతమ్ నంద’. హన్సిక, కేథరిన్ కథానాయికలు. సంపత్నంది దర్శకత్వం వహిస్తున్నారు. జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మాతలు. ప్యాచ్ వర్క్ మినహా టాకీ పూర్తయింది. త్వరలో దుబాయ్లో రెండు పాటల్ని తెరకెక్కిస్తారు. మేలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘‘గోపీచంద్లోని యాక్షన్ కోణాన్ని కొత్తగా చూపించే చిత్రమిది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్లుక్కి మంచి స్పందన వస్తోంది. ఇలాంటి గెటప్లో గోపీచంద్ని ఎప్పుడూ చూళ్లేదని చెబుతున్నారు.
సంపత్నంది చిత్రాన్ని స్టైలిష్గా తీర్చిదిద్దుతున్నారు. ఈనెల ద్వితీయార్ధంలో దుబాయ్లో ఇదివరకెప్పుడూ చూడని కొత్త లొకేషన్లలో రెండు పాటల్ని తెరకెక్కిస్తాం. కథానాయకుడి పరిచయ గీతాన్ని కొత్తగా చూపించబోతున్నాం. ఈ రెండు పాటలకూ రాజు సుందరం నృత్య రీతులు సమకూరుస్తారు.
ఏప్రిల్లో మిగిలిన మూడు పాటల్ని హైదరాబాద్లోనే చిత్రీకరిస్తామ’’న్నారు. సంగీతం: తమన్
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







