ఖతార్లో 7 శాతం పెరగనున్న వాణిజ్య అద్దెలు
- September 25, 2015
ఖతార్లో వాణిజ్య అద్దెలు 2017 నాటికి 7 శాతం పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. అల్ అస్మాఖ్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కంపెనీ ఈ మేరకు అంచనా వేసింది. 2017 నాటికి పెద్ద సంఖ్యలో వాణిజ్య భవనాలు అందుబాటులోకి రానున్నాయనీ, ఇప్పటికే అవి నిర్మాణంలో వున్నాయని, అవి అందుబాటులోకి వస్తే 5 నుంచి 7 శాతానికి వాణిజ్య అద్దెల పెరుగుదల నమోదవుతుందని ఆ సంస్థ వెల్లడించింది. పెట్టుబడిదారులకు ఇదే మంచి తరుణమని పేర్కొన్న ఆ సంస్థ, ఖతార్లో రానున్న రోజుల్లో రియల్ ఎస్టేట్ రంగం బాగా పుంజుకోవడం ఖాయమని అల్ అస్మాఖ్ చెబుతుంది. కార్యాలయాలు ఎక్కువగా నాలుగు ప్రాంతాల్లోనే ఫోకస్ అయి ఉన్నాయి. వెస్ట్ బే ఎక్కువమంది కోరుకుంటున్న అనువైన ప్రాంతం. గ్రాండ్ హమాద్ స్ట్రీట్, దోహా డౌన్ టౌన్లలో బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, చిన్న చిన్న కంపెనీలు ఎక్కువగా ఉంటున్నాయి. రింగ్ రోడ్స్ మధ్యతరహా, ఉన్నత తరహా కార్పొరేట్స్ కోసం అనువుగా ఉన్నాయి. అల్ సాద్ కార్పొరేట్స్కి అనుకూలం. ముందు ముందు కాలంలో వివిధ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ ఇంకా బాగా విస్తరిస్తుందనీ, అన్ని ప్రాంతాలూ సమానంగా డిమాండ్ని కలిగి ఉంటాయని రియల్ ఎస్టేట్ సంస్థలు అంచనా వేశాయి.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







