యూఏఈ కమర్షియల్‌ షిప్‌ హైజాక్‌

- March 15, 2017 , by Maagulf
యూఏఈ కమర్షియల్‌ షిప్‌ హైజాక్‌

యూఏఈ కేంద్రంగా పనిచేస్తున్న ఓ సంస్థ నిర్వహిస్తున్న కమర్షియల్‌ వెస్సెల్‌ని, సోమాలియా కోస్ట్‌లో దుండగులు హైజాక్‌ చేశారు. ఆరిస్‌ 13 అనే పేరుతో నడుస్తున్న ఆయిల్‌ ట్యాంకర్‌ని ఆయుధాలు కలిగి ఉన్న దుండుగులు హైజాక్‌ చేసినట్లు నిర్ధారించారు. ఈ దారిలో 2012 తర్వాత ఇంత భారీ కమర్షియల్‌ వెస్సెల్‌ని హైజాక్‌ చేయడం ఇదే తొలిసారి. ప్రస్తుతం హైజాకర్లతో చర్చలు జరుగుతున్నాయి. నేవల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌, ఆ వెస్సెల్‌ని క్షేమంగా హైజాకర్లను విడిపించేందుకు ప్రయత్నిస్తున్నాయి. షిప్‌లో శ్రీలంకకు చెందిన 8 మంది సిబ్బంది ఉన్నారు. సౌతాఫ్రికాకి చెందిన అర్మి షిప్పింగ్‌ కంపెనీ ఈ షిప్‌ సొంతదారు. యూఏఈలోని ఫుజారియాలోగల అరౌరా షిప్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ఈ షిప్‌ నిర్వహణ బాధ్యతల్ని చూసుకుంటోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com