తెలుగు శిల్పి హర్షవర్ధన్‌ దురుగడ్డకు ఆస్ట్రేలియా పురస్కారం

- March 15, 2017 , by Maagulf
తెలుగు శిల్పి హర్షవర్ధన్‌ దురుగడ్డకు ఆస్ట్రేలియా పురస్కారం

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శిల్పి హర్షవర్ధన్‌ దురుగడ్డ ప్రతిష్టాత్మక 'రియో టింటో స్కల్ప్చర్‌ అవార్డ్‌' ను గెలుచుకున్నారు. మార్చి 3 నుంచి 20 వరకూ పశ్చిమ ఆస్ట్రేలియాలో జరిగే పోటీలో అవార్డు కింద ఆయన 50,000 డాలర్లు గెలుచుకున్నారు. 'విజువల్‌ డైనమిక్స్‌ ఆఫ్‌ యాన్‌ ఆడియో వేవ్‌' అంశంలో హర్షవర్ధన్‌ తయారుచేసిన కాలమ్‌ ఆఫ్‌ సౌండ్‌(ధ్వని స్తంభం) శిల్పానికి ఈ అవార్డు లభించింది.
ఈ పోటీలను గత 13 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది పోటీల్లో 70 మంది స్థానిక, అంతర్జాతీయ శిల్పులు పాల్గొంటున్నారు. కళాకృతులను చూడడానికి ఈ ఏడాది దాదాపు 2,20,000 సందర్శకులు హజరయ్యే అవకాశం ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com