ఫేక్ హైరింగ్ ఏజెన్సీకి గుడ్ బై చెప్పిన ఖతార్ కంపెనీ
- March 16, 2017
అక్రమంగా కొన్ని సంస్థలు ఉద్యోగాలు కల్పిస్తామంటూ నిరుద్యోగాల్ని మోసం చేస్తున్న వ్యవహారాలు ఎప్పటికప్పుడు వెలుగచూస్తూనే ఉన్నాయి. ఖతార్కి చెందిన అల్ స్రాయా గ్రూప్, ఇండియాలోని ఓ ఏజెన్సీ తప్పుడు జాబ్ ఆఫర్స్తో నిరుద్యోగుల్ని తప్పుదోవపట్టిస్తున్నట్లుగా గుర్తించి, దోహాలోని ఇండియన్ ఎంబసీకి ఈ మేరకు ఫిర్యాదు చేసింది. తమిళనాడులోని కోయంబత్తూర్కి చెందిన సంస్థగా దీన్ని గుర్తించారు. ఈ సంస్థకి కేవలం ఇండియాలో ఉన్న ఏజెన్సీలతో మాత్రమే డీల్ చేసేలా రిజిస్టర్ అయి ఉంది. పెద్ద మొత్తంలో నిరుద్యోగుల నుంచి డిపాజిట్లు సేకరించి, అక్రమాలకు ఆ సంస్థ పాల్పడుతున్నట్లుగా నిర్ధారించడం జరిగింది. ఉద్యోగార్థులు ఏ ఏజెన్సీని సంప్రదించాల్సి వచ్చినాసరే ఆ సంస్థ గురించి పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంటుందని అల్ సాయా గ్రూప్ ప్రతినిథులు చెప్పారు. అక్రమ ఏజన్సీల ద్వారా ఉద్యోగాలు పొంది గల్ఫ్ దేశాలకు వచ్చేవారు సమస్యలను ఎదుర్కోక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







