ఇబ్రాలో ఇండియన్ స్కూల్ కొత్త బిల్డింగ్ నిర్మాణం కోసం బోర్డ్ ఒప్పందం
- March 17, 2017
బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ (బిఓడి), సైఫ్ బిన్ హషిల్ అల్ మాస్కెరీతో కలిసి ఇమ్రాలోని అల్ యహ్మాది వద్ద ఇండియన్ స్కూల్ కొత్త బిల్డింగ్ నిర్మాణం కోసం ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. అల్ మస్కెరీ కార్యాలయంలో మార్చ్ 12న ఈ ఒప్పందాల కార్యక్రమం జరిగింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ - ఇండియన్ స్కూల్స్ ఛైర్మన్ వి జార్జ్, మాట్లాడుతూ, విద్యార్థులకు మెరుగైన విద్యతోపాటు, సౌకర్యాలను అందించేందుకోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు చెప్పారు. ఇండియన్ స్కూల్ బోర్డ్ వైస్ ఛైర్మన్ సిఎం నజీబ్, డైరెక్టర్స్ ఇన్ఛార్జ్ బేబీ సామ్ సామ్యూల్, సికె అంచన్, ప్రిన్సిపల్ రెగి ఊమ్మెన్, అసిస్టెంట్ ఎడ్యుకేషన్ అడ్వయిజర్ అలెక్స్ జోసెఫ్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అతి త్వరలో ఈ భవన నిర్మాణం ప్రారంభమవుతుంది. 2018లో ఈ భవన నిర్మాణం పూర్తి కానుంది.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







