భారీ వరదలు పెరూలో
- March 17, 2017
- 12 మందికి పైగా మృతి
పెరూలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు పరవళ్ళు తొక్కుతున్నాయి. ఈ వరదల్లో 12 మందికి పైగా మరణించారు. పెరూ రాజధాని లిమాలో కురిసిన భారీ వర్షాలకు కొండ చరియలు విరిగి పడ్డాయి. బురద నీరు వీధుల్లోకి, నివాసాల్లోకి ప్రవేశించింది. దాదాపు 10 లక్షల మంది నివసించే ఈ నగరం గతంలో ఇలాంటి విపత్తులను ఎన్నడూ చవిచూడలేదు. ఈ వరదల్లో ఒక మహిళ కొట్టుకు పోతూ ఎట్టకేలకు సురక్షితంగా బయట పడిన ఘటనతో సహా కొన్ని దృశ్యాలను స్ధానికులు తమ సెల్ఫోన్లలో బంధించి ఇతరులతో పంచుకున్నారు. కొన్ని ఫామ్ హౌస్లలో నిర్మించిన కట్టడాలతో పాటు, పశువులు కూడా వరదల్లో కొట్టుకు పోయాయి.
వరదల్లో నివాసాలు కోల్పోయిన వారికి కొత్తవాటిని నిర్మించి ఇవ్వాలని పెరూ అధ్యక్షులు పెడ్రో పాబ్లో కుజిన్స్కి అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







