భారీ వరదలు పెరూలో

- March 17, 2017 , by Maagulf
భారీ వరదలు పెరూలో

- 12 మందికి పైగా మృతి 
          పెరూలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు పరవళ్ళు తొక్కుతున్నాయి. ఈ వరదల్లో 12 మందికి పైగా మరణించారు. పెరూ రాజధాని లిమాలో కురిసిన భారీ వర్షాలకు కొండ చరియలు విరిగి పడ్డాయి. బురద నీరు వీధుల్లోకి, నివాసాల్లోకి ప్రవేశించింది. దాదాపు 10 లక్షల మంది నివసించే ఈ నగరం గతంలో ఇలాంటి విపత్తులను ఎన్నడూ చవిచూడలేదు. ఈ వరదల్లో ఒక మహిళ కొట్టుకు పోతూ ఎట్టకేలకు సురక్షితంగా బయట పడిన ఘటనతో సహా కొన్ని దృశ్యాలను స్ధానికులు తమ సెల్‌ఫోన్‌లలో బంధించి ఇతరులతో పంచుకున్నారు. కొన్ని ఫామ్‌ హౌస్‌లలో నిర్మించిన కట్టడాలతో పాటు, పశువులు కూడా వరదల్లో కొట్టుకు పోయాయి.
వరదల్లో నివాసాలు కోల్పోయిన వారికి కొత్తవాటిని నిర్మించి ఇవ్వాలని పెరూ అధ్యక్షులు పెడ్రో పాబ్లో కుజిన్స్కి అధికారులను ఆదేశించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com