భారతీయ విద్యార్ధిని ఇంద్రాణి జూ.నోబెల్ ప్రైజ్ ను గెలుచుకున్నారు

- March 17, 2017 , by Maagulf
భారతీయ విద్యార్ధిని ఇంద్రాణి జూ.నోబెల్ ప్రైజ్ ను గెలుచుకున్నారు

అమెరికాలో ప్రవాస భారతీయులు మరోసారి సత్తా చాటారు. సైన్స్‌, మ్యాథ్స్‌ పోటీల్లో ఇచ్చే ప్రతిష్ఠాత్మక 'సొసైటీ ఫర్‌ సైన్‌ అండ్‌ ది పబ్లిక్‌' పురస్కారాన్ని ఇండో అమెరికన్‌ ఇంద్రాణి దాస్‌ కైవసం చేసుకున్నారు. పోటీల్లో మొదటి స్థానంలో నిలిచి.. రెండున్నర లక్షల డాలర్ల ఫ్రైజ్‌ మనీని సొంతం చేసుకున్నారు. మెదడుకి అయ్యే గాయాలు, సంక్రమించే వ్యాదుల విషయంలో పరిశోధనలకు గానూ ఇంద్రాణి ఈ అవార్డును గెలుచుకున్నారు. అటు కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌లో పరిశోధనల్లో మూడో స్థానంలో నిలిచిన అర్జున్‌ రమణీ.. లక్షన్నర డాలర్ల నగదు ఫ్రైజ్‌ను గెలుచుకున్నారు. జూనియర్‌ నోబెల్‌ ఫ్రైజ్‌గా పిలిచే ఈ అవార్డ్‌ను శాస్త్రీయ పరిశోధనలకు గానూ SSP అనే సంస్థ ప్రతీ ఏటా ఇస్తోంది. ఈ ప్రతిష్ఠాత్మక పోటీల్లో.. మరో నలుగురు భారత సంతతి విద్యార్థులు సైతం మొదటి పది స్థానాల్లో ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com