భారతీయ విద్యార్ధిని ఇంద్రాణి జూ.నోబెల్ ప్రైజ్ ను గెలుచుకున్నారు
- March 17, 2017
అమెరికాలో ప్రవాస భారతీయులు మరోసారి సత్తా చాటారు. సైన్స్, మ్యాథ్స్ పోటీల్లో ఇచ్చే ప్రతిష్ఠాత్మక 'సొసైటీ ఫర్ సైన్ అండ్ ది పబ్లిక్' పురస్కారాన్ని ఇండో అమెరికన్ ఇంద్రాణి దాస్ కైవసం చేసుకున్నారు. పోటీల్లో మొదటి స్థానంలో నిలిచి.. రెండున్నర లక్షల డాలర్ల ఫ్రైజ్ మనీని సొంతం చేసుకున్నారు. మెదడుకి అయ్యే గాయాలు, సంక్రమించే వ్యాదుల విషయంలో పరిశోధనలకు గానూ ఇంద్రాణి ఈ అవార్డును గెలుచుకున్నారు. అటు కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో పరిశోధనల్లో మూడో స్థానంలో నిలిచిన అర్జున్ రమణీ.. లక్షన్నర డాలర్ల నగదు ఫ్రైజ్ను గెలుచుకున్నారు. జూనియర్ నోబెల్ ఫ్రైజ్గా పిలిచే ఈ అవార్డ్ను శాస్త్రీయ పరిశోధనలకు గానూ SSP అనే సంస్థ ప్రతీ ఏటా ఇస్తోంది. ఈ ప్రతిష్ఠాత్మక పోటీల్లో.. మరో నలుగురు భారత సంతతి విద్యార్థులు సైతం మొదటి పది స్థానాల్లో ఉన్నారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







