జయ శోభన్బాబు కొడుకునంటూ కోర్టుకు ఫేక్ పత్రాలతో
- March 17, 2017
జయలలిత ఆస్తుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా.. జయ తనయుణ్ని నేనే అంటూ కృష్ణమూర్తి అనే వ్యక్తి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. దానికి సాక్ష్యాలంటూ కొన్ని డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించాడు. అయితే ఆ పత్రాలన్నీ నకిలీవంటూ కోర్టు అతనికి స్ట్రాంగ్ వార్నింగిచ్చింది.
జయలలిత కుమారుణ్ని తానేనంటూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన క్రిష్టమూర్తి అనే వ్యక్తిపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తన వాదనకు అతను సమర్పించిన పత్రాలపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అవి నకిలీవని ఎల్కేజీ కుర్రాడు కూడా చెప్పేస్తాడంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
కృష్ణమూర్తి తాను జయలలిత, శోభన్బాబుల కుమారుడిని అంటూ వాదిస్తున్నాడు. తాను 1985లో జన్మించానని.. ఏడాది తర్వాత ఈరోడ్లోని వసంతమణికి తనను దత్తత ఇచ్చేశారంటున్నాడు. ఇందుకు రుజువులుగా.. తనను వసంతమణికి దత్తత ఇస్తున్న ఫొటోలను, ఎంజీఆర్ సాక్షి సంతకం చేసిన దత్తత పత్రాలను కోర్టుకు సమర్పించాడు. అయితే కృష్ణమూర్తి సమర్పించిన పత్రాలన్నీ ఫేక్ డాక్యుమెంట్లని మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చెన్నై సిటీ కమిషనర్కు ఒరిజినల్ పత్రాలు సమర్పించాలని ఆదేశించింది. కోర్టుతో ఆడుకోవద్దని హెచ్చరించింది. ఇప్పటికే జయలలితకు అసలైన వారసులు ఎవరనే వివాదం నడుస్తోంది. ఇంతలో కొత్తగా కృష్ణమూర్తి తెరపైకి వచ్చాడు. అతను చెబుతున్న దానిలో నిజమెంత అనేది పోలీసుల విచారణలో తేలనుంది.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









